నరసన్నపేటలో అన్నదమ్ముల సవాల్
Publish Date:Apr 3, 2012
Advertisement
శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన కుటుంబం నేడు కుటుంబ కలహాలతో సతమతమవుతోంది. ఈ జిల్లానుంచి ఎన్నికయిన ధర్మాన ప్రసాదరావు మంత్రిగా కొనసాగుతుండగా ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయి తాజా మాజీగా మారారు. వైయస్ మరణానంతరం జగన్ సొంత కుంపటి పెట్టడంతో ఎమ్మెల్యే కృష్ణదాస్ ఆయన పంచన చెరి అనర్హత వేటుకు గురయ్యారు. అక్కడినుంచే వీరి కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన మరో సోదరుడు రామ్ దాస్ రంగలో నిలబడ్డారు. కుటుంబంలో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన రామ్ దాస్ ఒక వర్గంగా ఏర్పడ్డారు. మరోవైపు వీరి అన్నగారైన ధర్మాన కృష్ణదాస్ వీరికి వ్యతిరేకంగా మారారు. దీంతో నరసన్నపేట ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ధర్మాన కృష్ణదాస్ నిత్యం తన సోదరుడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాద రావుపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రసాదరావి రాజకీయంగా తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, తన సహచరులను బెదిరిస్తున్నాడని తన ఓటమికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నాడని కృష్ణదాస్ ఆరోపిస్తున్నాడు. తాజాగా తనముందు ధర్మాన ప్రసాదరావు బచ్చాగాడని, అతనికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనని కృష్ణదాస్ ప్రకటించాడు. ఒకవైపు అన్నగారు తనపై ఒంటికాలిపై వస్తున్నా తమ్ముల్లిద్దరూ మాత్రం నిగ్రహంతో వ్యవహరిస్తుండటం విశేషం.
http://www.teluguone.com/news/content/srikakulam-district-congress-party-24-13139.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





