Publish Date:Sep 13, 2022
అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడని తెలిసి పెద్దావిడ వెళ్లింది. గృహప్రవేశం రోజు ఇల్లంతా పసుపునీల్లు జల్లి, ద్వారాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి తోరణాలు కట్టి నానా హడావుడీ చేసిందామె. ఎవరో ఛాదస్తం అన్నారు. కాదు సంప్రదాయమన్నదామె. పక్కవీధిలో మొన్నటికి మొన్న ఆవే ఈనితే లక్ష్మీదేవి అంటూ పూజలు చేసి గోశాలంతా పసుపునీల్లు చిలకరించి దణ్ణాలు పెట్టి ఇల్లంతా పండగ చేసుకున్నారు. కానీ చిత్రంగా ముంబైలో ఉద్ధవ్ థాక్రే అనుచరులు మాత్రం గోమూత్రాన్ని రోడ్డంతా చిలకరించారు!
అసలే అక్కడ ఉద్ధవ్ థాక్రే, షిండేల మధ్య విభేదాలతో ఇరువర్గాల వారూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అది ఇప్పుడు మరింత రోడ్డు మీదకి వచ్చేసింది. తమ నాయకుడిని గద్దె దించాడని థాక్రేవర్గీయులు పీక ల్లోతు కోపంతో ఉన్నారు. షిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుచరులు థాక్రే వర్గీయుల పని పడుతున్నారు. థాక్రే వర్గీయులను ఆకట్టుకోవడానికి ఒక్కోరికి షిండే ఏకంగా రూ.50 కోట్లు ఇచ్చి నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు వీలయితే అప్పుడు ఇరువర్గాల వారూ కొట్లాటకీ దిగుతు న్నారు.
మొన్నీమధ్యనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఔరంగాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసా రు. అది కాగానే షిండే, ఆయనతో వచ్చినవారంతా వెళిపోయారు. ఏదో పెద్ద దోషం జరిగినట్టు థాక్రే అను చరులు కొందరు వెంటనే ఆ ప్రాంత మంతా గోమూత్రంతో పరిశుద్ధి చేయడానికి పూనుకున్నారు. చిన్న చిన్న ప్లాస్టిక్ బకెట్లలో నీళ్లు, గోమూత్రం కలిపిన నీళ్లు తెచ్చి ఆ ప్రాంతమంతా చిలకరించారు. ఇంతకంటే వైరం మరోటి ఉండదు. థాక్రే, షిండేల మధ్య వైరం ఏ స్థాయిలో ఉందన్నది ఈ సంఘటన స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sprinkling-of-cow-urine-25-143668.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.