లాంఛనం పూర్తయ్యింది..ఈటల సస్పెండయ్యారు!

Publish Date:Sep 13, 2022

Advertisement

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు. ముఖ్యమంత్రి తలకుచుంటే ఎమ్మెల్యేకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఎంత మాత్రం లభించదు అని ఇప్పుడు  అనుకోవలసిన పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస బహిష్కృతుడు ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించినా.. కేవలం కేసీఆర్ కు ఇష్టం లేని కారణంగా ఇప్పటి వరకూ అసెంబ్లీలో కూర్చో లేని పరిస్థితి. తాజాగా ఆయనను మంగళవారం (సెప్టెంబర్ 13) మరో సారి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

ఆయన సభలోకి అడుగుపెట్టకుండానే.. అంటే అసెంబ్లీ సెషన్ ప్రారంభం కావడానికి ముందే స్పీకర్ కార్యాలయం నుంచి ఈటలపై సస్పెన్షన్ వేటు నిర్ణయం వెలువడింది. అసలు ఆయనను  సోమవారమే (సెప్టెంబర్ 12)సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. అయితే సోమవారం ఈటల సభకురాకపోవడంతో ఆయన సస్పెన్షన్ విషయాన్ని అధికార టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. కాగా ఈటల సోమవారం సభకు గైర్హాజర్ కావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వాటికి చెక్ పెట్టేందుకా అన్నట్లుగా మంగళవారం సభకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అధికార పక్షం మాత్రం ఆయనకు ఆ అవకావం ఇవ్వలేదు.

అసెంబ్లీకి వచ్చిన ఈటలను పోలీసులు బలవంతంగా సభ నుంచి బయటకు పంపేశారు. అసెంబ్లీకి వెళుతున్నట్లుగా ఈటల మీడియాకు సమాచారం అందించడంతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతకీ  ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ వేటుకు కారణమేమిటంటే.. సభ ప్రారంభం రోజున బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులకు ఆహ్వానం అందకపోవడంపై ఈటల విమర్శించడమే. బీఏసీ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడంపై ఈటల స్పీకర్ మరమనిషి అని ఈటల చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ మండిపడింది. తన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణ చెప్పాలనీ, లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తప్పవనీ హెచ్చరించింది.

అయితే క్షమాపణ చెప్పేందుకు ఈటల నిరాకరించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు అనివార్యమని అంతా ఊహించారు. అందరూ ఏం ఊహించారో అదే జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఈటల అసెంబ్లీకి  హాజరు కాకుండా కుట్ర చేస్తున్నారనీ, ఆయన గొంతు నొక్కేయాలని చూస్తున్నారనీ బీజేపీ విమర్శిస్తున్నది. గత సమావేశాలలో బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న కారణంతో స్పీకర్ పోచారం సభ నుంచి బీజేపీ సభ్యులు ముగ్గురినీ ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను సస్పెండ్ చేశరు.

ఇక ప్రస్తుత సమావేశాలకు వచ్చే సరికి ఈటల సస్పెండ్ కాగా, మరో ఎమ్మెల్యే రాజాసింగ్ జైలులో ఉన్నారు. ఇక సభలో మిగిలిన ఏకైక సభ్యుడు రఘునందనరావు మాత్రమే. ఇలా ఉండగా కేసీఆర్ కు ఈటల పట్ల ఉన్న అయిష్టత కారణంగానే ఆయనపై పదే పదే సస్పెన్షన్ వేటు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.