Publish Date:Sep 13, 2022
మొన్నామధ్య ఏడో తరగతి పిల్లాడు సోషల్ పరీక్షరాయడానికి క్లాసులోకి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు టీచర్. అందులో ఒక ప్రశ్న చూసి ఆ విద్యార్ధి తెగ కంగారు పడ్డాడు. సోషల్ అనగానే మరీ ఇంత తాజా రాజకీయాల సంబంధిత ప్రశ్న అడుగుతారని ఊహించలేదు. ఇంతకీ ఆ ప్రశ్నేమిటంటే ఎమ్మెల్యే అంటే ఎవరు? అని! దానికి ఆ విద్యార్ధి మనం ఎవ్వరం ఊహించని సమాధా నం రాశాడు. ఎన్ని కల సమయంలో వచ్చి పెద్దోళ్లకి బిర్యానీ, డబ్బులిచ్చేవాడని!!
ఏడో తరగతి విద్యార్ధి ఏమాత్రం తడుముకోకుండా తనకు తెలిసింది రాసేసాడు. ఏమాత్రం తప్పు రాయ లేదని ఎంతో ధైర్యంగా పేపరు ముగించి టీచర్కి ఇచ్చేసి వెళ్లాడు. ఇంతకీ ఆ పిల్లవాడు రాసినది ఇన్విజి లేటర్ చూసి ఆశ్చర్యపోయింది. ఎవ్వడూ ఇంత చిన్నవయసువాళ్లు ఇలాంటి సమాధానం చెప్పడం, రాయడం ఆమె కనీ వినీ ఎరుగదు. ఆశ్చర్యం కాదు.. కడుపుబ్బ నవ్వుకుంది ఆ టీచర్!
ఎన్నికల సమయంలో ఇంటికి వచ్చి పెద్దోళ్లకి డబ్బులు, మహిళలకు చీరలు ఇచ్చేవాడే ఎమ్మెల్యే అని గట్టి నమ్మకంతో ఆ పిల్లవాడు రాశాడు. వాస్తవంగా చూసినది, తెలిసినదే రాశాడు. ఆ సమాధానం నవ్వుకోవ డానికి బాగానే ఉందనుకోవద్దు. ఎందుకంటే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అలా ఉందిగనుక. నిజమే, గ్రామా ల్లో అభివృద్ధి కార్యక్రమాల మాట ఎలా ఉన్నా, ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సమయంలో మాత్రం తప్ప కుండా ప్రతీ ఇల్లూ తిరిగే ఎమ్మెల్యేలు చాలాకాలం నుంచే ఇంటి పెద్దకు డబ్బులు, మహిళలకు చీరలు పంచి తమకు ఓటు వేసి గెలిపించాలని వేడుకోవడం పరిపాటిగా మారింది. ఇంతకంటే దారుణం మరోటి ఉండదని అనుకోవచ్చు. పెద్దవాళ్లు సరే, ఇలాంటి సంఘటనలు, సంద ర్భాలు పిల్లలు.. రాబేయే తరం మీద ఎంత ప్రభావం చూపుతుందన్న ఆలోచన ఈ తరానికీ లేకపోవడమే దురదృష్టకరం.
ఇంతకీ ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ మండలం లింగారెడ్డి గూడ స్కూల్లో జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ పేపరు దిద్దిన మాష్టారు ఆ సమాధానానికి 4 మార్కలు వేయడం!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-means-money-spender--25-143665.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.