ఇక షిండే, ఫ‌డ్న‌వీస్ ల యాత్ర‌

Publish Date:Jul 6, 2022

Advertisement

ముఖ్య‌మంత్రి షిండే, ఉప ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ వంటి దిగ్గ‌జాలు వుండ‌డంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గ‌గ‌లిగింది. వారికి వున్న భారీ మ‌ద్ద‌తు ప‌ట్ల ప్ర‌తిప‌క్ష శివ‌సేన‌, ఎన్‌సిపి, కాంగ్రెస్ ల‌కు ఎలాంటి సందేహం వుండ‌న‌క్క‌ర్లేదు. స్పీక‌ర్ ప‌ద‌వికి  గ‌త వారం జ‌రిగిన ఎన్నిక  మ‌హా ప్ర‌భుత్వం సుమారు ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలుగా ప‌న్నుతున్న వ్యూహాన్ని తెలియ‌జేసింది. మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఎ) ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొత్త స్పీక‌ర్ ఎన్నిక విష‌యంలో స్ప‌ష్ట‌మ‌యింది. షిండే,  ఫ‌డ్న‌వీస్‌ల ప్ర‌యాణం మున్ముందు అంత సుల‌భ‌సాధ్యంగా సాగ‌కాపోవ‌చ్చు. 

షిండే ఈ ఎన్నిక‌ను మామూలుగా జ‌ర‌గాల‌నే ఆకాంక్షించిన‌ప్ప‌టికీ, గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ అందుకు ఎలాంటి అభ్యంత‌ర‌మూ చెప్పలేదు. రాజ్యాంగ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన‌వారు  ప్ర‌భుత్వం మాట‌కు త‌ల వూపి అంగీక‌రించ‌డ‌మే చిత్రం. శివ‌సేన ఎమ్మెల్యేల‌ను పెద్ద సంఖ్య‌లో ఆక‌ట్టుకోవ‌డంలో షిండే  ఘ‌న విజ‌యం సాధించింది. మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే  ఇప్ప‌టికైనా త‌న ఎమ్మెల్యేలు త‌న‌ను  ఎందుకు మోస‌గించార‌నేది తెలుసు కోవాలి.  

అధికార దాహంతో తాను చేసిన లోపాల‌వ‌ల్ల‌నే వారంతా షిండే పంచ‌న చేరార‌న్న బిజెపి అన డాన్ని థాక్రే ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. బ‌ల‌ప‌రీక్ష‌లో విప‌క్షాల ఓట్లు త‌గ్గ‌డం ఎంవిఏ నాయ‌కుల‌ను ఇబ్బందిపెట్టే అంశ‌మే. అస‌లు ఆ స‌మ‌యానికి చాలామంది స‌భ‌కు రావ‌డంలో జాప్య‌మ‌యింది. వ‌చ్చినా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగానే ఓటు వేశారు. ఏమైన‌ప్ప‌టికీ కొద్ది రోజుల్లో అన్నీ ప‌రిష్క‌రింప‌బ‌డ‌తాయి. అయితే,  షిండే ప్ర‌భుత్వం అసెంబ్లీ మిగిలిన కాలం ఎలాంటి ఇబ్బందిలేకుండా గ‌డిపేయ‌గ‌ల‌ద‌న్న‌ది ఖాయం. థాక్రే గ్రూప్‌కి ప్ర‌స్తుతం ఇది గ‌డ్డు కాలం. 

ఇక ఇపుడు షిండేకు త‌న మంత్రిమండ‌లి ఎంపిక కీల‌కంగా మారింది. పూర్తిస్థాయి మంత్రిమండ‌లిని అన్ని వ‌ర్గాలకు ప్రాతినిధ్యం క‌ల్పించేలా చేప‌ట్టాలి. రాష్ట్రంలో ఊహించ‌ని ప‌రిణామాల స‌మ‌యానికి షిండేకు ప‌లు వ‌ర్గాల ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తునిచ్చారు గ‌నుక ఇపుడు మంత్రిమండ‌లి ఎంపిక విష‌యం షిండే వ్యూహాలు ఏమాత్రం మంచి ఫ‌లితాన్నిస్తుంద‌నేది తెలియ‌జేస్తుంది. ప్ర‌స్తుతం థాక్రేకు మ‌ద్ద‌తుగా వున్న శివ‌సేన ఎమ్మెల్యేల‌ను మ‌ద్ద‌తు కూడా షిండే త‌న వేపు తిప్పుకోవాల్సిన అవ‌స‌రం వుంది. దీనికి మ‌రి షిండే అనుస‌రించే వ్యూహ‌మేమిట‌న్న‌ది తెలియాలి. ఈ ప‌రిస్థితుల్లో,  తానే అస‌లుసిస‌లు శివ‌సేన అధినేత ను అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు. అధికార‌గ‌ణం మ‌ద్ద‌తుతో, బాల్‌థాక్రేకి అస‌ల‌యిన రాజ‌కీయ వార‌సుడ‌ను తానే అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు. అలా ధైర్యం చేస్తేనే త్వ‌ర‌లో జ‌రిగే ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యానికి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి. బిజెపితో క‌లిసి ఈ ఎన్నిక‌లు గెలిస్తే, థాక్రే గ్రూప్ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డ‌డం ఖాయం. గ‌తంలో ఎంవిఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు, ఎన్‌సిపిగాని కాంగ్రె స్ గాని తాను ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌క‌పోవ‌చ్చ‌నే షిండే అన్నారు. వాస్త వానికి షిండే  స్వీయ బ‌లంతోనే సీఎం ప‌ద‌వి చేరుకోవ‌డంతో  ఆ ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి అర్హ‌త‌ను రుజువు చేసుకున్నారు. 

ఎంవిఏ పార్టీలోనివార‌యినా, బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తునిస్తున్న‌వారిలోనైనా  ఎవ్వ‌రినీ ఏదో ఒక సిద్ధాంతం అడ్డుపెట్టుకుని చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోను వీలు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌డం థాక్రే ప్ర‌భుత్వం సాధిం చిన విజ‌యంగా చెప్పాలి. రాష్ట్రంలో శాంతి, ప్ర‌జాభిప్రాయాలే ఏ సిద్ధాంతాల‌కంటే అతీత‌మ‌ని  థాక్రే  ప్ర‌భుత్వం భావించింది. అయితే ప్ర‌జ‌లు త‌న నుంచి ఏమి ఆశిస్తున్నార‌న్న‌ది షిండే కి ఎవ‌రూ ప్ర‌త్యేకించి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి సీఎం ప‌ద‌వికి చేరుకున్నా రు. మ‌రింత మంది ఎమ్మెల్యేల‌ను త‌న వేపు లాక్కోనేందుకు సీఎం ప‌ద‌వి వుప‌యోగించుకు నేట్ల‌యితే, పాల‌నా వ్య‌వ‌హారాలు స‌ర‌యిన మార్గాల్లోకి తీసుకురావ‌డం పెద్ద స‌వాలుగా మారుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏదో ఒక కార‌ణంతో ప్ర‌భుత్వం అంత గొప్ప‌గా న‌డ‌వ‌లేదు. అంతెందుకు మాజీ ఆర్ధిక మంత్రి ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించేవార‌ని షిండేనే గ‌తంలో ఫిర్యాదు చేశారు. థాక్రే పై షిండే ధ్వ‌జ మెత్తిన ప్ప‌టి నుంచీ  పాల‌నా వ్య‌వ‌హారాలు నిలిచిపోయాయ‌నాలి. పోలీసు వ్య‌వ‌స్థ నిర్వీర్య‌మైంది. అవినీతి త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. ఈ ప‌రిస్థిత్తులో మ‌ళ్లీ మ‌హారాష్ట్ర పూర్వ వైభ‌వాన్ని తీసుకురావ‌డానికి షిండే త‌ల‌నెరిసేలా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ఎందుకంటే అభివృద్ధి ప‌థంలో మ‌హా రాష్ట్ర కంటే గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు ఎంతో ముందంజ‌లో వున్నాయి.  వేగిర‌మే అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట కుంటే రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశాలే వుండ‌వు. ఈ ప‌రిస్థితుల కార‌ణంగా షిండే, ఫ‌డ్న‌వీస్ ల‌కు మున్ముందు సుఖంగా ప్ర‌యాణించే వీలు వుండ‌దు. అడుగ‌డుగునా స‌మ‌స్య‌లు, ప్ర‌శ్న‌లు, అనుమానాల‌తోనే అంద‌రూ ఆహ్వానాలు ప‌లుకుతారు.

By
en-us Political News

  
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.