Publish Date:Aug 19, 2022
మళ్లీ రిజర్వు బ్యాంక్ నుంచి మరో వెయ్యికోట్లు రుణ సమీకరణ చేశారు. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. దీనిపట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Publish Date:Aug 19, 2022
ఒక పోలీసాయన.. రాత్రి కాస్తంత పొద్దు బోయాక ఇల్లు చేరాడు. టోపీ తీసి టేబుల్ మీద పడేసి అలానే మంచం మీద పడుకున్నాడు. చాలాసేపటికి ఇంట్లో వారు లేపితే కాస్తంత తిని పడుకు న్నాడు. అంతలో పేద్ధ శబ్దం. బయటపెట్టిన టూవీలర్ పేలిపోయింది. పరుగున పోలీసాయన బయటికి వచ్చేడు. బండి కాలి బొగ్గయింది. తనకు తెలిసిన వెధవల్ని తలచుకున్నాడాయన. . ఇది చాలా సహజంగా మనం చూసే సిని మాలో సీన్. సరే ఆనక ఆయనే బెల్టు సర్దుకుని వెంటాడి వాడేవడినో పట్టేసుకుంటాడు. కానీ ఈమధ్య అమృత్సర్లో దాదాపు ఇదే సీన్ కానీ ఇంతగా ఏమీ జరగలేదు. కారణం ఓ కుక్క!
Publish Date:Aug 19, 2022
చాలాకాలం క్రితం ఏకంగా పోలీసులు మీదనే కాల్పులు జరిపి పారిపోయాడీ ఘనుడు. అలా వెళ్లినవాడు నిన్ననే భారత్-నేపాల్ సరిహద్దు వద్ద పట్టుబడ్డాడు.
Publish Date:Aug 19, 2022
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో బేటీ కానున్నారు. మునుగోడులో ఈ నెల 21న జరగనున్న సభకు అమిత్ షా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే సభకు ముందు లేదా తరువాత అమిత్ షా రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇందు కోసం ఆయన షెడ్యూల్ లో ప్రత్యేకంగా మార్పులు కూడా చేశారు. దాదాపు గంట సేపు రామోజీ రావు, అమిత్ షాల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Publish Date:Aug 19, 2022
స్మితా సబర్వాల్ సీనియర్ ఐఎ ఎస్ అధికారి కనుక గుజరాత్ ప్రభుత్వ నిర్వాకం పట్ల ఆశ్చర్యపోయారు
Publish Date:Aug 19, 2022
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఆ పార్టీ స్థానిక నేతల్లో అనైక్యతే కారణమనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఉన్నాయి. మళ్లీ ఇంత కాలానికి పార్టీ జవసత్వాలు కూడదీసుకుని అధికార రేసులో బలంగా నిలిచిన తరుణంలో మళ్లీ అనైక్యత జాడ్యం మరోసారి జడలు విదిల్చి రంగంలోకి దూకింది.
Publish Date:Aug 19, 2022
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష పడిన 11మందీ జైల్లో ఎంతో సత్ప్రవర్తనతో మెలిగారట. అంచేత వారిని విడిచిపెట్టారు.
Publish Date:Aug 19, 2022
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి స్థానం లేకపోవడాన్ని పరిశీలకులు సైతం అనూహ్య పరిణామంగానే పరిగణిస్తున్నారు. మోడీ కేబినెట్ లో అమిత్ షా తరువాత గట్టిగా వినిపించే పేరు నితిన్ గడ్కరీ మాత్రమే. అంతే కాదు ఆయన నాగపూర్ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. నాగపూర్ పెద్దలు అనగానే ఆర్ఎస్ఎస్ కీలక నేతలు అన్న విషయం తెలిసిందే. మోడీ 2.0కు ముందు ప్రధాని పదవి కోసం ఆర్ఎస్ఎస్ నితిన్ గడ్కరీ పేరును ఒకింత సీరియస్ గానే పరిగణించింది.
Publish Date:Aug 19, 2022
విద్యుదుత్పత్తి సంస్థల నుంచి రోజూ కొంటున్న విద్యుత్కు బిల్లులు సకాలంలో చెల్లించాలి. కానీ ఏపీ సర్కార్ అలా చేయలేదని చర్యలు తీసుకోవడానికి కేంద్రం నిర్ణయించింది.
Publish Date:Aug 19, 2022
ఒక వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేస్తూ రాకెట్ వేగంతో దూసుకు పోతుంటే.. మరో వైపు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి స్పీడును అందుకుంటూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పరుగులు తీస్తున్నారు. ఆయనకు పార్టీ బలోపేతంతో పాటు మంగళగిరిలో తన విజయానికి బాటలు వేసుకోవడమన్న అదనపు బాధ్యత కూడా ఉంది. ఎక్కడైతే పరాజయం ఎదురైందో అక్కడే తన విజయాన్ని ఘనంగా చాటాలన్న పట్టుదలతో లోకేష్ ముందుకు సాగుతున్నారు.
Publish Date:Aug 19, 2022
సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవ స్థానానికి చెందిన పంచగ్రామాల భూము ల్ని ఆక్రమణదారుల పేరు మీద క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందుకు ఏకంగా చట్టం కూడా తెచ్చింది. హై కోర్టు ఆగ్రహించింది
Publish Date:Aug 19, 2022
వచ్చే ఏన్నికలలో టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన శపథాన్ని నెరవేర్చుకునేందుకు సమరసన్నాహాలు చేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాల పేరుతో ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు పర్యటించిన చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు ప్రారంభించారు.
Publish Date:Aug 19, 2022
ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్యలు విఫలమయ్యాయి. ఉపాథ్యాయుల హాజరు కోసం ప్రభుత్వం తప్పని సరి చేసిన ఫేస్ రికగ్నేషన్ యాప్ పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఆ యాప్ డౌన్ లోడ్ చేయడం, దాంట్లో లగిన్ అవ్వడం తప్పని సరి చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.