హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్ చెక్ పెట్టాయి. పోలీసులే కనిపించడం లేదని ధీమాగా వ్యవహరించిన వారికి.. తమ మధ్యలోనే మఫ్టీలో షీ టీమ్స్ ఉన్నాయన్న విషయం ఆలస్యంగా తెలిసింది. అప్పటికే వారి చేష్టలు కెమెరాల్లో రికార్డయ్యాయి. బోనాల సందర్భంగా మహిళలను వేధిస్తూ ఆకతాయితనా నికి పాల్పడిన 678 మందిని షీ టీమ్స్ గుర్తించాయి.
జనసం దోహంలో మహిళలను వెంబడించడం, అసభ్యం గా ప్రవర్తించడం, ఇబ్బం దులకు గురిచేయడం వంటి ఘటనలను షీ టీమ్స్ సిబ్బంది మఫ్టీలో నిశితంగా గమనించారు. అనుమానం వచ్చిన వెంటనే వీడియో ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్నారు. షీ టీమ్స్ సేకరించిన వీడియో ఆధారాలతో పలువురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆకతాయిలకు కోర్టు శిక్షలు విధించింది.
25 మందికి జైలుశిక్షతో పాటు జరిమానాలు పడగా.. మరో 11 మందికి మూడు రోజుల జైలు, రూ.1,050 జరిమానా విధించారు. ఇక 26 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించడంతో పాటు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. పండుగ వేళ మహిళలకు భద్రత కల్పించేందుకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగి స్తున్నాయి. మఫ్టీలో ఉండటంతో తమను ఎవరూ గుర్తించలేరన్న ధీమాతో ఆకతాయిలు చేసే ప్రతి కదలికను గమనిస్తున్నాయి. బోనాల జాతరలో భక్తి ముసుగులో ఆకతాయి తనం చేస్తే.. ‘షీ’ టీమ్స్ కెమెరా కంటికి చిక్కాల్సిందే.. కోర్టు మెట్లెక్కాల్సిందే..!
Shes eye at the Bonala Jathara, She Teams, CM Revanth reddy, Telangana police, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shes-eye-at-the-bonala-jathara-36-228178.html
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
అదృష్టం అనేది ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటలీలో ఒక మహిళను వరించిన భారీ అదృష్టం క్షణాల్లో చేజారిపోయినట్లే కనిపించినా, చివరికి అనూహ్య రీతిలో ఆమె వద్దకే చేరింది.
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్పిఎస్, ఇన్స్పిరాన్, ఏలియన్వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్ను, 70% మంది ఆన్లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! పెళ్లి చేసుకునే మహిళలకు 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కొత్త పథకాలను బడ్జెట్లో ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.