ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల? ఏం జరుగుతుందంటే..?

Publish Date:Dec 11, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఇక నూకలు చెల్లినట్లేనా?  ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులు గంపగుత్తగా వెళ్లి పోవడానికి  ఒక పార్టీ రెడీ అవుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇంతకీ వైసీపీని అంతగా బెంబేలెత్తిస్తున్న ఆ పార్టీ ఏమిటయ్యా అంటే.. అదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించిన పార్టీయే రాష్ట్ర విభజన తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ నామమాత్రంగా మిగిలిన పార్టీ. ఔను కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన అనంతరం అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ కూడా ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అంతే కాదు, ఇరు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయింది. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత దాదాపుగా దశాబ్దం తరువాత తెలంగాణలో పుంజుకుంది. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు ఏపీ వంతు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఒకింత అభిమానం ఉంది. అయితే విభజనకు ముందు ఆ పార్టీ చేసిన తాత్సారం, అవలంబించి వైఖరి కారణంగా తెలంగాణ ఇచ్చి కూడా దశాబ్దకాలం రాష్ట్రంలో ప్రతిపక్షంగానే మిగిలిపోయింది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 

ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు వేళయ్యింది. అయితే తెలంగాణలోలా ఏపీలో కాంగ్రెస్ పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలత ఇసుమంతైనా లేదు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పాట్ల సానుకూలత ఉంటే, ఏపీలో మాత్రం తమ అభీష్ఠానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండుగా ముక్కులు చేసిందన్న ఆగ్రహం జన బాహుల్యంలో బలంగా వ్యక్తం అవుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీలో జనం ఆ పార్టీని అసెంబ్లీలో అడుగుకూడా పెట్టనివ్వకుండా శిక్షించారు. పదేళ్ల తరువాత కూడా ఏపీ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఆ పార్టీ పుంజుకోవడానికి షర్మిల రూపంలో ఒక  ఆశ కనిపించింది. 
ఏపీ జనం దివంగత సీఎం వైఎస్ రాజకీయ వారసుడిగా  ఆయన కుమారుడు జగన్ కు 2019 ఎన్నికలలో ఒక చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టారు. అయితే సీఎంగా ఆయన తీరు, ఆయన పాలనపై నాలుగున్నరేళ్లలోనే విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉంది. అలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ తనయ షర్మిల అడుగుపెట్టనున్నది.

ఆమె ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే..  ఏపీ కాంగ్రెస్ లో ఒక్క సారిగా నూతనోత్సాహం వస్తుందని కాదు కానీ.. అధికార వైసీపీ మాత్రం పూర్తిగా బలహీనపడుతుంది. ఏదో ఒక మేరకు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ వారసుడిగా భావించి జగన్ పంచన చేరిన పూర్వ కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ లోకి వలస వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ పార్టీలో ఇమడ లేక, మరో మార్గం కానరాక పార్టీలోనే అనామకులుగా మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరొక్కరుగా లేదా గంపగుత్తగా కాంగ్రెస్ లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైసీపీలో ఆందోళన తారస్థాయికి చేరుకుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను కూడా షర్మిల ఏపీ ఎంట్రీ ఖాతాలో వేసేస్తున్నారు. వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అనామకంగా జగన్ పార్టీలో కొనసాగుతున్న వారంతా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. 

అన్నిటికీ మించి ఇప్పటికే అధికార పార్టీలో 30 మందికి పైగా సిట్టింగులకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి వారిలో అత్యధికులు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.  అంతే కాకుండా ఇప్పటికే తల్లినీ, చెల్లినీ దూరం పెట్టిన జగన్ ఇప్పుడు సోదరి తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపట్టడం ఆయనకు తీవ్ర నష్టం చేయడం ఖాయం. షర్మిల ఏపీ ఎంట్రీతో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ బలపడుతుందని చెబుతున్నారు. విజయం సాధించే పరిస్థితి ఉండకపోయినా విపక్షంగా ఎదిగే అవకాశం షర్మిల రాకతో కాంగ్రెస్ కు  దక్కినట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

 

By
en-us Political News

  
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.