టీసీఎస్ లో లైంగిక వేధింపులు.. విచారణలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

Publish Date:Apr 14, 2026

Advertisement

సంకలనం, సేకరణ: కంఠమనేని సీతారాం

దేశంలోని  ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ బ్రాంచ్ పై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పని ప్రదేశంలో లైంగిక వేధింపులు,  మానసిక ఒత్తిడి,  వివక్ష, వంటి అంశాలు ఉన్నాయని దర్యాప్తు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కేసు ప్రకారం, హెచ్ ఆర్, ట్రైనింగ్ విభాగాలకు చెందిన వ్యక్తులు కలిసి  యువ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ప్రధానంగా  బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారన ఆరోపణలు ఉన్నాయి. 

దర్యాప్తు మేరకు 18–25 సంవత్సరాల మధ్య వయస్సు గల   మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.  ఆర్థికంగా, సామాజికంగా బలహీన స్థితిలో ఉన్న వీరు ముందుగానే గుర్తించి వారినే లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.   అధికారిక  ఆన్ బోర్డింగ్ కు ముందే ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం  

హెచ్ ఆర్, ట్రైనింగ్ నెట్వర్క్ ఒక వ్యవస్థీకృత విధానంగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి, హెచ్ ఆర్ టీమ్ అభ్యర్థులను స్క్రీన్ చేసి ఎంపిక చేయడం, ఆ వివరాలను ప్రత్యేక ట్రైనర్లు, టీమ్ లీడర్లతో పంచుకోవడం, వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేషన్, సమన్వయం జరిపినట్లు ఆరోపణలు 
 అలాగే మానసిక ,  మతపరమైన ఒత్తిడికి గురి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకటని కాదు.. పలు విధానాల ద్వారా బాధితులను వీరి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.   హిందూ ధర్మంపై విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు, ఆహారపు అలవాట్లలో బలవంతపు మార్పులు అంటే బీఫ్ తినమని ఒత్తిడి చేయడం, అలాగే మతాచారాలను మార్చుకోవాలని అంటే నమాజ్ చేయమని  తీవ్ర ఒత్తిడి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మానసికంగా ప్రభావితం చేసి, విశ్వాసాలను దెబ్బతీయడం, అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత అవమానాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ట్రైనింగ్ దశలో కూడా మహిళలపై వేధింపులకు పాల్పడటం జరిగిందని తెలుస్తోంది. అదెలాగంటే.. 

ట్రైనింగ్ కాలాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచుకుంటూ పోవడం, వ్యూహాత్మకంగా వారిని బలహీనులను చేసి వేధించడం, మతపరమైన వ్యాఖ్యలు ప్రవేశపెట్టడం, వ్యక్తిగత ప్రభావం చూపించడం, ఆర్థిక, సామాజిక బలహీనతలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ వేధింపులు ఉన్నాయని చెబుతున్నారు.  
ఈ వ్యవహారంలో టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ హెచ్ఆర్ హెడ్ నిధారా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హెచ్ఆర్, ట్రైనింగ్ నెట్వర్క్ కీలక పాత్ర పోషించిందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.  అభ్యర్థుల వివరాలను షేర్ చేయడంలో కూడా పాత్ర ఉందా అన్న దానిపైనా విచారణాధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం నిధారా ఖాన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.  
ఇప్పటివరకు..  టీమ్ లీడర్లు, ట్రైనర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వంటి పలువురిని ఈ కేసులో అరెస్టు చేశారు.  

దీనిపై టీసీఎస్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పందిస్తూ.. సమస్య తీవ్రతను గుర్తించినట్లు పేర్కొన్నారు. సీఓఓ ఆర్తి సుబ్రహ్మణ్యన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ జరుగుతోందన్నారు.   సంస్థ  జీరో టోలరెన్స్” విధానాన్ని అవలంబిస్తున్నదని.. చట్టప్రకారం దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు.  

టీసీఎస్ లో మహిళలపై వేధింపుల ఘటన    పని ప్రదేశంలో మానసిక వేధింపులను ఎలా గుర్తించాలి? మతపరమైన స్వేచ్ఛకు రక్షణ సరిపోతుందా?  కార్పొరేట్ సంస్థల్లో సురక్షిత వాతావరణం ఉందని ఎలా నిర్ధారించాలి? బలహీన వర్గాల ఉద్యోగులకు అదనపు రక్షణ అవసరమా?  అన్న ప్రశ్నలను తెరమీదకు తీసుకువచ్చింది.  

ప్రస్తుతం ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.  ఆరోపణలన్నీ నిర్ధారణ అయ్యాయి. అయినా, పని ప్రదేశంలో నైతికత, వ్యక్తిగత గౌరవం, మత స్వేచ్ఛ వంటి అంశాలపై ఈ ఘటన ఒక విస్తృత చర్చ జరగాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు సంస్థలు, చట్టపరమైన వ్యవస్థలు, పనిచేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

By
en-us Political News

  
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిణామాల మధ్య, ఇరాన్‌తో నేరుగా లేదా పరోక్షంగా చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గెలుస్తామో లేదో తెలియని యుద్ధాన్ని కొనసాగించేకంటే.. ఏదో ఒకలా ఏదో మేరకు శాంతి కుదిరితే అదే పదివేలన్న భావనలో అమెరికా ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా సాగుతున్నది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం.. ఇప్పుడు లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.