చేతులెత్తేసిన సుజనా చౌదరి... సంక్షోభంలో మహా టివి
Publish Date:Mar 29, 2012
Advertisement
సీనియర్ జర్నలిస్టు ఐ.వెంకట్రావు ఎన్నో ఆశలు, ఆశయాలతో ప్రారంభించిన మహా టివి తెలుగు న్యూస్ ఛానెల్ సంక్షోభంలో పడింది. మహా టివి యాజమాన్యం గత మూడు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. దీంతో దాదాపు సగంమంది సిబ్బంది ఈ ఛానెల్ ను వదిలి వేరే దారి చూసుకున్నారు. ఇప్పటిదాకా ఈ ఛానెల్ కు సుజనా గ్రూప్ సంస్థల చైర్మన్ సుజనా చౌదరి ఫండింగ్ చేస్తూ వచ్చారు. ఆయన తాను మొదట ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం మూడేళ్ళపాటు ఈ ఛానెల్ కు నిధులు సమకూర్చారు. మూడేళ్ళు ముగిసిన తరువాత ఆయన వద్ద నుంచి నిధులు ఆగిపోవడంతో మహా టివి మహా సంక్షోభంలో పడింది. ఈ ఛానెల్ నిర్వహణకు నెలకు సుమారు రూ. కోటి 10లక్షల నుంచి రూ.కోటి 20లక్షల వరకు అవుతుంది. అయితే ఆదాయం మాత్రం నెలకు రూ. 60లక్షల నుంచి రూ. 70 లక్షలకు మించి రావడం లేదు. గతంలో కూడా ఇదే పరిస్థితి వున్నప్పటికీ సుజనా చౌదరి ఫండింగ్ తో ఐ.వెంకట్రావ్ ఛానెల్ ను నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆర్ధిక సహాయం నిలిచిపోవడంతో వెంకట్రావు ఇబ్బందుల్లో పడ్డారు. మహా టివి ఛానెల్ ను గట్టెక్కించే చర్యల్లో భాగంగా ఎక్స్ ట్రా అనే ఒక సినీ ఛానెల్ కూడా ఐ.వెంకట్రావు ప్రారంభించారు. సినీ ఛానెల్ కు డబ్బులు బాగా వస్తాయని ఆయన భావించి ఎక్స్ ట్రాను ప్రారంభించారు. అయితే ఎక్స్ ట్రా కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దీంతో వెంకట్రావుపై మరో అదనపు భారం పడినట్లయింది.
http://www.teluguone.com/news/content/senior-journalist-ivenkatrao-24-12991.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





