గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై మంగళవారం (ఆగస్టు 4) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం అంపోలు జైలుకు తిరిగి తరలించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారకుడైన కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికీ, పోలీసులను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించారంటూ సీదిరి అప్పలరాజు ఈ కేసులో పోలీసులు ఏ3గా నిందితుడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రిమాండ్ లో ఉన్న అప్పలరాజును కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజును మంగళవారం (ఆగస్టు 4) కట్టుదిట్టమైన భద్రత నడుమ కాశీబుగ్గ స్టేషన్కు తరలించి నాలుగు గంటల పాటు విచారించారు. దానయ్య మృతికి దారితీసిన రోడ్డు ప్రమాద ఘటన ఎప్పుడు జరిగింది,
ప్రమాదం జరిగిన సమయంలో అప్పలరాజు ఎక్కడ ఉన్నారు, ఘటన స్థలానికి ఆయన ఎంత సమయానికి చేరుకున్నారు తదితర అంశాలపై పోలీసులు ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. కోర్టు విధించిన 1 రోజు పోలీస్ కస్టడీ గడువు పూర్తి కావడంతో, పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, పోలీసు బందోబస్తు మధ్య తిరిగి అంపోలు జైలుకు తరలించారు.
Seediri Appalaraju, Kasibugga Police Station, Danayya death case, Police custody, Ampolu Jail Srikakulam, former minister
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seediri-appalaraju-36-228039.html
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ సోదాలు బీహార్ కు చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్, విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు, అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు.
దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు, సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది.
947లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన ఇండియా.. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాసచుసెట్స్ లో పంద్రాగస్టును ఇండియా డేగా జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు
హర్మూజ్ జలసంధి మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది. అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!