గుడిసెల నుంచి గౌరవప్రద జీవితం వైపు...పేదలకు ప్రభుత్వం అండ

Publish Date:May 24, 2026

Advertisement

 

పూరి గుడిసెలకు గుడ్‌బై... ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ దూకుడు..

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు... తెలంగాణ ప్రభుత్వ భారీ లక్ష్యం..

తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ దశలో 2.5 లక్షల గృహాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో 1,500 ఇళ్లను కొత్త లబ్ధిదారులకు నిర్మించగా, మిగిలిన 500 ఇళ్లను గతంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల పూర్తి కోసం వినియోగించనుంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరితో కలిసి గృహనిర్మాణ, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గంలో కేటాయించే 1,500 కొత్త ఇళ్లకు గతంలో అమలు చేసిన విధానంలోనే నిర్మాణ దశలను బట్టి దశలవారీగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇక అసంపూర్తిగా మిగిలిన ఇళ్లలో పునాదులు పూర్తై గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబు దశలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు కూడా ఈ నిర్ణయంతో లాభపడనున్నారు. 

అలాగే ఉమ్మడి రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సిమెంట్‌, స్టీల్‌, నగదు రూపంలో రూ.25 వేల సాయం పొందిన వారిని కూడా రెండో విడత ఇందిరమ్మ పథకానికి అర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారికి ఇప్పటికే ఇచ్చిన రూ.25 వేలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించిన సుమారు 14,800 పూరి గూడిసెల కుటుంబాలకు కూడా రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. “గుడిసెలు లేని తెలంగాణ” లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక కోర్ అర్బన్ ఏరియా (క్యూర్‌) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 

గ్రేటర్ హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాల కోసం లక్ష ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనుంది. క్యూర్‌ పరిధిలో 6 నుంచి 7 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 18,500 మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారికి ఈ నెలాఖరులోగా రూ.5 లక్షల సాయం అందించనుంది.


ఎల్‌ఐజీ వర్గాలకు 400–420 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వనుండగా, ప్రభుత్వం రూ.5 లక్షలతో పాటు అన్‌డివైడెడ్ ల్యాండ్‌ షేర్‌ను ఉచితంగా ఇవ్వనుంది. అదనంగా వచ్చే రూ.4–5 లక్షల వ్యయాన్ని లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. జీవనోపాధి ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

అలాగే క్యూర్‌ పరిధిలో నిర్మించే లక్ష ఇళ్లలో 30 శాతం ఇళ్లను ఎంఐజీ వర్గాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఐజీ లబ్ధిదారుల నుంచి వసూలు చేసే నిధులను ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్లు వెల్లడించింది.

ఇక తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.22,500 కోట్లతో మంజూరైన 4.5 లక్షల ఇళ్లలో పూర్తయిన లక్ష ఇళ్లకు జూన్‌ 1న గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రెండో విడత 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.


 

By
en-us Political News

  
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.