నేటి నుంచీ నాగోబా జాతర

Publish Date:Jan 18, 2026

Advertisement

 దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరఆదివారం (జనవరి 18) రాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం సర్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీ వరకూ జరిగే ఈ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరుగుతుంది. మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన నాగోబాకు పుష్యమాస అమావాస్య రాత్రి నిర్వహించే మహాపూజలతో ఈ ఈ జాతర   ప్రారంభం అవుతుంది. . ఈ జాతరను   ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

మెస్రం వంశీయులు విత్ర గోదావరి జలాలతో మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన వచ్చి  నాగోబాకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జాతరలో భాగంగా ఈనెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్‌ పూజ, మహిళలు విశేషంగా పాల్గొనే భాన్‌ దేవత పూజలు జరుగుతాయి. 

ఈ జాతరలో  భాగంగా  ఈ నెల 22న గిరిజన దర్బార్ జరుగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో పాటుగా ఇతర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఈ జాతర కోసం   మెస్రం వంశీయులు తెల్ల దుస్తులు ధరించి.. కలమడుగు వద్ద గోదావరి జలాలను సేకరించి పాదయాత్రగా కేస్లాపూర్ చేరుకున్నారు. శనివారం (జనవరి 17) తూమ్  పూజలు ముగించుకున్నారు. ఆదివారం (జనవరి 18) ప్రధాన ఉత్సవంలో పాల్గొంటారు. ఈ జాతర కోసం కేస్లాపూర్ పొలిమేరలోని మర్రిచెట్టు ప్రాంతం మెస్రం వంశీయులతో సందడిగా మారింది. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

By
en-us Political News

  
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ.. సంక్షేమ రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు. సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు నిలిచారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయారు
హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన టీటీడీ దర్శనం కోటా షెడ్యూల్‌ను ప్రకటించింది.
తెలంగాణలో 20మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు
కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు
సికింద్రాబాద్ మున్సిపల్ సాధన కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.
నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు గ్ర‌హీత కొరినా మ‌చాడో అందజేసింది
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకే పార్టీ తొలి విడత మేనిఫెస్టో ప్రకటించింది.
మేడారం మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లక్షల మంది భక్తులు వన దేవత లైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి రానున్న నేపథ్యంలో.. వారికి ఎటువంటి ప్రయాణ ఇబ్బందులూ తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.