రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన

Publish Date:Jan 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపడం కోసం చంద్రబాబు అరహారం కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల ను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఆదివారం (జనవరి 18) దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు  ఆదివారం (జనవరి 18)  రాత్రి 8.35 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీ నుంచి సోమవారం ( జనవరి 19) తెల్లవారుజామున 1.45 గంటలకు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు చేరుకుంటారు.  జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 20 దేశాల నుంచి వచ్చే ప్రవాసాంధ్రులను  ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు.

ఈ పర్యటన ద్వారా ఆయన మరోసారి విశ్వ వేదికపై తన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యుఈఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం బయలుదేరింది. పెట్టుబడిదారులను ఆకర్షించి, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ పారిశ్రామిక పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు భారీ ప్రణాళికతో ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు ఈ నాలుగు రోజులూ అత్యంత బిజీగా గడపనున్నారు.  సదస్సు వేదికగా  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలను చాటేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా  ఏపీ లాంజ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, పోర్టులు, నూతన పారిశ్రామిక విధానాలు , ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు కీలక సమావేశాలలో పాల్గొంటారు.  

 సాంకేతిక , పారిశ్రామిక రంగాల్లో  అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సి.ఇ.ఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖీ చర్చలు జరపుతారు.  ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, మౌలిక సదుపాయాల కల్పన , తయారీ రంగాల్లో  సహకారం అంశాలపై  ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.  ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ , ఎరోస్ ఇన్నోవేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తారు. అనంతరం అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన మీడియా సంస్థ ‘పొలిటికో’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు తెలియజేయనున్నారు.ఈ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు..మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం,  ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.   

By
en-us Political News

  
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ.. సంక్షేమ రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు. సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు నిలిచారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయారు
మెస్రం వంశీయులు విత్ర గోదావరి జలాలతో మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన వచ్చి నాగోబాకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది.
హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన టీటీడీ దర్శనం కోటా షెడ్యూల్‌ను ప్రకటించింది.
తెలంగాణలో 20మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు
కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు
సికింద్రాబాద్ మున్సిపల్ సాధన కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.
నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు గ్ర‌హీత కొరినా మ‌చాడో అందజేసింది
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకే పార్టీ తొలి విడత మేనిఫెస్టో ప్రకటించింది.
మేడారం మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లక్షల మంది భక్తులు వన దేవత లైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి రానున్న నేపథ్యంలో.. వారికి ఎటువంటి ప్రయాణ ఇబ్బందులూ తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.