ఆర్టీసీ చర్చలు విఫలం కావడంతోటి ఆర్టీసీ సమ్మే మరింత ఉధృక్తం చేయనుంది ఆర్టీసీ జేఏసీ .ఎక్కడి బస్సులను అక్కడే నిలిపిసేందుకు చర్యలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టీసీ జేఏసీ.దసరా సెలవుల కారణంగా ఊళ్ళుకు వెళ్ళాలనుకున్న ప్రజలు ఎప్పటినుంచో రిజర్వేషన్లు చేయించుకుని ఎంతో ఆనందంగా సెలవులు గడపాలని అనుకున్నరు. కానీ ఈ వార్త విన్న దెగ్గర నుండి ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సు హెవీ లైసెన్స్ కలిగినటువంటి వాళ్లు పధ్ధెనిమిది నెలల అనుభవం ఉన్నటువంటి వాళ్లు వచ్చి డిపో మేనేజర్ కలవాలని పిలుపును ఇవ్వడం జరిగింది. కండెక్టర్ లుగా కావల్సినటువంటి వాళ్లు టెన్త్ మెమో తోటి, ఆధార్ కార్డు తోటి హాజరు కావాలని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఆర్టీసీ యాజమాన్యం ఆ మేరకు చర్యలు తీసుకుంది.
మరోవైపు హైయర్ బస్సులను రోడ్ల మీద తిప్పేందుకు ప్రయత్నలు కూడా చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికుల్లో భయాందోళన మొదలైయ్యింది. ఆర్టీసీ కార్మిక నేతలు మాత్రం సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. వారు వారి నిర్ణయాన్ని వెన్నక్కు తగ్గే అవకాశమే లేదని వాదనలు వెల్లడవుతున్నయి.వారు కనక డిస్మిస్ అయితే తిరిగి వారిని మళ్ళీ ఎప్పటికి ఉద్యోగాలకు తీసుకునే అవకాశం లేదని టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వం ఖరాకండిగా తెల్చేసింది.దీనికి ప్రత్యమ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ సమ్మే విషయాన్ని అదునుగా భావించిన ప్రైవేటు బస్సులు దీన్ని అవకాశంగా తీసుకొని భారీగా చార్జీలు ఇప్పటి నుంచే వసూలు చేయటం ప్రారంభించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rtc-strike-in-telangana-25-89772.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.