రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారణాధికారి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ ను విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ కార్యాలయంలో ఆదివారం (ఏప్రిల్ 5) విచారించారు. విచారణ అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ స్వయంగా విచారించారు. అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఎవరి ఆదేశాలతో అరెస్టు చేశారు? టార్చర్ పెట్టాలన్న ఆదేశాలు ఎక్కడ నుంచి వచ్చాయి? రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా? అంటూ దామోదర్ సునీల్ నాయక్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.
ఇలా ఉండగా విచారణకు సునీల్ నాయక్ ఏ మాత్రం సహకరించలేదని అంటున్నారు. హైదరాబాద్ వెళ్లి మరీ రఘురామకృష్ణం రాజును ఎలా అరెస్టు చేశారు. అలా హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేయడం చట్టపరిధి దాటడమే కదా? ఏ ప్రతిఫలం ఆశించి రూల్స్కు వ్యతిరేకంగా కేసులు పెట్టారు? అంటూ విచారణాధికారి సునీల్నాయక్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే వీటిలో చాలా ప్రశ్నలకు సునీల్ నాయక్ సమాధానం చెప్పలేక తడబడినట్లు తెలిసింది. అ గుండె ఆపరేషన్ అయి కోలుకుంటున్న రఘురామకృష్ణం రాజును హైదరాబాద్ నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరం కారులో ఎలా తీసుకొస్తారు? అలా కారులో తీసుకురమ్మని మీకు ఎవరైనా ఆదేశాలిచ్చారా? అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇదే కేసులో సీఐడీ ఏఎస్పీగా ఉంటూ రిటైర్డ్ అయిన విజయపాల్ ను శనివారం(ఏప్రిల్ 4) విచారించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా డీఐజీ హోదాలో ఉన్న సునీల్నాయక్ ఆదేశాలతోనే రఘురామను అరెస్టు చేశానని విజయపాల్ చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సునీల్ నాయక్ను ఎస్పీ దామోదర్ అడిగినట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rrr-custodial-torture-case-36-216753.html
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.