2027 వన్డే వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్ ఆడతాడా? కోచ్‌కు రోహిత్ ఇచ్చిన మాట ఏంటి?

Publish Date:Jul 21, 2026

Advertisement

భారత క్రికెట్ జట్టు సీనియర్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, క్రీడా వర్గాల్లోనూ రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అతని ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలు, వయసుపై విమర్శకులు రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ కేవలం 110 బంతుల్లోనే 138 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అద్భుతమైన సెంచరీ సాధించి, తనపై వస్తున్న విమర్శలన్నింటికీ బ్యాట్‌తోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ మైదానంలో ఒత్తిడిని అధిగమిస్తూ అతడు ఆడిన శతకం అభిమానులను మైమరపించడమే కాకుండా, అతనిలో పరుగుల దాహం ఇంకా ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా నిరూపించింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ రిటైర్‌మెంట్ వార్తలకు పూర్తిగా తెరపడింది.

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడూతూ హిట్‌మ్యాన్ కెరీర్, అతని రిటైర్మెంట్ ప్రణాళికలపై సంచలన విషయాలను వెల్లడించారు. లార్డ్స్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందే తాను రోహిత్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు దినేశ్ లాడ్ తెలిపారు. ఆ సంభాషణలో తాను '2027 వన్డే ప్రపంచ కప్‌లో నిన్ను భారత జట్టు తరఫున ఆడుతూ చూడాలనుకుంటున్నాను' అని చెప్పగా, రోహిత్ శర్మ ఎంతో నమ్మకంతో 'తప్పకుండా ఆడుతాను కోచ్ సర్' అని బదులిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రోహిత్ శర్మలో ఇప్పటికీ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా, అపరిమితమైన ప్రతిభ, మానసిక దృఢత్వం ఉన్నాయని దినేశ్ లాడ్ ప్రశంసించారు.

రోహిత్ శర్మ మనసులో ఇప్పటికీ ఆరని రెండు గాయాలు ఉన్నాయని, అదే అతన్ని 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడేలా ప్రేరేపిస్తున్నాయని దినేశ్ లాడ్ వివరించారు. మొదటిది, 2011 వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో చోటు దక్కకపోవడం రోహిత్ శర్మను ఇప్పటికీ ఎంతో వేధిస్తోంది. ఇక రెండోది, 2023 వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ రెండు సంఘటనలు రోహిత్ మనసులో ఆరని గాయాలుగా మిగిలిపోయాయి. అందుకే భారత్‌కు ఎలాగైనా సరే వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని అందించి తీరాలనే బలమైన కోరిక అతనిలో బలంగా ముద్రపడిపోయింది.

rohit sharma lords 138 runs century future plans,hitman rohit sharma retirement secret coach reveals.
 

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.