ఎర్ర చందనం స్మగిలింగ్ సమస్య ఏపీ ప్రభుత్వానిదేనా?

Publish Date:Sep 1, 2015

Advertisement

 

మూడు నెలల క్రితం శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ తరువాత స్మగిలింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయని అనుకొంటే ఇంకా పెరిగిపోయాయి. ఈ మూడు నెలల వ్యవధిలో రాష్ట్ర అటవీశాఖ అధికారులు, పోలీసులు అనేకమంది ఎర్రచందనం చెట్లు నరుకుతున్న కూలీలను అరెస్ట్ చేసారు. అనేక కోట్ల విలువయిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నారు. అనేక వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. అయినా ఎర్రచందనం స్మగిలింగ్ కార్యకలాపాలు ఆగడం లేదు. స్మగ్లర్ల బారి నుండి ఎర్రచందనం చెట్లను కాపాడుకోవడం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

 

శేషాచలం అడవుల్లో ఈతమాకులగుంట అనే ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారనే సమాచారం అందడంతో 12మంది రిజర్వు పోలీసులు నిన్న రాత్రి అక్కడికి చేరుకొన్నప్పుడు అక్కడ వారికి ఏకంగా 200 మందికి పైగా స్మగ్లర్లు కనబడ్డారు. పోలీసుల కంటే స్మగ్లర్ల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో వారు పోలీసులపై రాళ్ళతో దాడి చేసారు. పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుండి పారిపోయారు. నలుగురు స్మగ్లర్లు పట్టుబడ్డారు.

 

ఇదివరకు ఎన్కౌంటర్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరణించినప్పుడు తమిళనాడులో అధికార అన్నా డీ.యం.కె.తో సహా అన్ని రాజకీయ పార్టీలనీ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు చేసాయి. చనిపోయిన వారందరూ ఎర్రచందనం స్మగ్లర్లు కారని, వారు పొట్ట కూటి కోసం పనిచేసే రోజువారి కూలీలేలని రాజకీయ పార్టీలన్నీ వాదించాయి. తమిళనాడు ప్రభుత్వం ఎన్కౌంటర్లో చనిపోయిన కూలీల కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు, నష్టపరిహారం కూడా చెల్లించింది. ఏపీలో కాంగ్రెస్, వైకాపాలు కూడా ఎన్కౌంటర్ ని ఖండించాయి. కోర్టులు, మానవ హక్కుల సంఘాలు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. నేటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎర్రచందనం స్మగిలింగ్ కార్యక్రమాలు మాత్రం నేటికీ యదేచ్చగా సాగిపోతూనే ఉన్నాయి.

 

ఒక ప్రభుత్వం దీనిని నేరంగా భావిస్తున్నప్పుడు మరొక ప్రభుత్వం కూలీలకు ఉద్యోగాలు, నష్టపరిహారం ఇచ్చి ప్రోత్సహిస్తునంత కాలం ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగానే అందరూ చూస్తున్నారు తప్ప దేశ సంపదను కొల్లగొడుతున్నట్లుగా, చట్ట వ్యతిరేఖ చర్యలుగా భావిస్తున్నట్లు లేదని రాజకీయ పార్టీల, తమిళనాడు ప్రభుత్వ ప్రతిస్పందన చూస్తే అర్ధమవుతోంది. ఎర్రచందనం స్మగిలింగ్ వార్తలను సర్వసాధారణ వార్తలయిపోయాయి. ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

 

తమిళనాడుకు చెందిన కూలీలే ఈ స్మగిలింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిసినప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో దీని గురించి మాట్లాడి ఈ సమస్యని శాశ్విత పరిష్కారానికి కృషి చేసి ఉంటే బాగుండేది. ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం అందుకు సహకరించదనుకొంటే, ఈ ఎర్ర చందనం స్మగిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకే ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పోలీస్ వ్యవస్థను, బలమయిన చట్టాలను ఏర్పాటుచేసుకోవలసిన అవసరం ఉంది.

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ సమస్య పరిష్కారానికి కూడా ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చును. ఇటువంటి స్మగిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవలసి ఉంటుంది. అలాకాక స్మగ్లర్లు చెట్లు నరుకుతున్నారని తెలిసినప్పుడు ఓ పదిమంది పోలీసులను పంపడం వలన స్మగ్లర్ల దాడిలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడమో లేకపోతే పోలీసుల కాల్పుల్లో స్మగ్లర్లు ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం రాజకీయ పార్టీల నుండి నిరసనలు, కోర్టు కేసులు ఎదుర్కోవడం, పొరుగు రాష్ట్రంతో సంబంధాలు దెబ్బ తినడం తప్పకపోవచ్చును.

By
en-us Political News

  
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.