చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యారా?

Publish Date:Sep 2, 2015

Advertisement

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిని ఎలా నిర్మించాలని.. దానిని ఎలా అభివృద్ధి చేయాలి.. అలాగే కేంద్ర నుండి ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా విషయంలో ఎలా నచ్చజెప్పాలని చూస్తుంటే ఇప్పుడు ఆపార్టీలో నేతలే ఆయనకు తలనొప్పిగా తయారయ్యారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాల్లో పార్టీ నేతల వల్ల ఆయనకు సమస్యలు వచ్చాయి.

 

అప్పుడు గోదావరి పుష్కరాలప్పుడు కూడా అలాగే జరిగింది. పుష్కరాలప్పుడు జరిగిన ప్రమాదంలో చాలా ప్రాణాలు మంది ప్రాణాలు పోగా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు మీద విమర్శలు చేశారు. దీని మీద నేషనల్ మీడియాలో జరిగిన ఇంటర్య్వూలో కూడా టీడీపీ నేతలు వారికి వచ్చీ రాని ఇంగ్లీష్ తో పాట్లు పడుతూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో నేతల భాషా పాండిత్యం పై మండిపడి ఇక నుండి ఇంగీష్ మీడియా మాట్లాడేందుకు గాను గల్లా జయదేవ్ ను నియమించారు.

 

అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏదో ఒక రకంగా పాట్లు పడుతుంటే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది ప్రజలు నిరాశపడొద్దు అని చెబుతుంటే ఈలోపు జేసీ దివాకర్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ వ్యాఖ్యలు చేస్తాడు. రాష్ట్ర విభజన కారణంగా రాయలసీమకు ఎక్కువ నష్టం జరిగిందని.. విభజన అనంతరం ఇస్తున్న ప్యాకేజీలో రాయలసీమకు న్యాయం చేయాలని.. లేదంటే రాయలసీమలో పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షనేత జగన్ ప్రత్యేక హోదా కోసం టీడీపీ నేతలంతా రాజీనామా చేయాలని విమర్శిస్తే.. దానికి ఆయన ఎంపీ లంతా కాదు ఆఖరికి ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదంటూ బాంబు పేల్చారు. 

 

మరోవైపు భూసేకరణలో కూడా చంద్రబాబుకు పార్టీ నేతలు సమస్యలు తెచ్చారు. ఇప్పటికే  ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి భూసేకరణపై పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ అవసరం లేదని.. భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఏపీకీ ఎంత ప్యాకేజీ ఇస్తుందో తెలియదు కానీ ప్రత్యేక ప్యాకేజీలో రాయలసీమకు లక్ష కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చంద్రబాబుకు ఓరకంగా తలనొప్పి వ్యవహారమే అని చెప్పవచ్చు.
 

 

మరోవైపు మంత్రి నారాయణ అయితే ఏకంగా ఈ భూసేకరణ బిల్లు విషయం చంద్రబాబుకు తెలియదని.. చంద్రబాబు దృష్టికి తీసుకురాకుండానే భూసేకరణ బిల్లు ఇచ్చామని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. భూసేకరణ బిల్లుకు చంద్రబాబు మొదటి నుండి వ్యతిరేకమే అని కానీ రాజధాని నిర్మాణానికి సమయం దగ్గర పడుతుండటంతో తానే నోటిఫికేషన్ జారీ చేయించానని చెప్పారు. ఇది ఒకరకంగా ప్రతిపక్షనేతలకు విమర్శించే అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. మరి ఇప్పటికైనా చంద్రబాబు పార్టీనేతల వైఖరిని మార్చకపోతే చాలా కష్టమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

By
en-us Political News

  
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.