చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి విదితమే. తాజాగా ఆయన ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో టీఆర్ఎస్ ని వీడటానికి గల కారణాలను వెల్లడించారు. అంతేకాకుండా మరికొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో సమస్యను చర్చించే అవకాశమే లేదనీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. రెండేళ్లుగా తాను అవమానాలను ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగానన్నారు. ఉద్యమంలో ఎవరినైతే ద్రోహులంటూ కేసీఆర్ దూషించారో.. వాళ్లే ఇప్పుడు పార్టీలో కీలకమయ్యారని ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఎందుకు అవసరమో తమకు తెలియదన్నారు. పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో.. ఎవరితోనూ చర్చించకుండానే ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారన్నారు. తన పర్సనాలిటీ ప్రాంతీయ పార్టీలకు సరిపోదన్న విషయం ఇప్పుడు అర్థమవుతోందని ఆయన అన్నారు. పార్లమెంట్లో ఒక రాంగ్ప్లేస్ నుంచి కూర్చున్నానని తనకు అనిపించిందన్నారు. టీఆర్ఎస్లో తాను ఎక్కువ కాలం ఉంటే.. అన్నాడీఎంకే నేతల్లా చేతులపై ‘కేసీఆర్.. కేటీఆర్’.. అని రాసుకోవాల్సి వస్తుందేమోనని భయం వేసిందన్నారు.
టీఆర్ఎస్లో చేరడం, ఆ తర్వాత పార్టీని వీడటం.. ఒక గొప్ప గుణపాఠమని విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. పైసలు పోయాయి.. పరువు పోయిందనీ చాలాసార్లు ఫీలయ్యానన్నారు. ‘టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా.. రాత్రిళ్లు సరిగా నిద్రపట్టడం లేదు. ఆత్మగౌరవం లేనప్పుడు ఇక ఇక్కడ ఉండి ఏం లాభం..’ అని తనకు అనిపించేదన్నారు. టీఆర్ఎస్లో ఎవరు మాట్లాడినా.. ముఖం,నోరు మాత్రమే వాళ్లవాని, మాటలు మాత్రం కేసీఆర్, కేటీఆర్లవని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీలమయిన మా కంటే.. మంత్రులే ఎక్కువగా టీఆర్ఎస్లో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ‘ఈ ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ గెలుస్తుంది.. టీఆర్ఎస్ గెలిచే అవకాశాలే లేవు. టీఆర్ఎస్కు 30 కంటే తక్కువ సీట్లు వస్తాయి..’ అని తన అభిప్రాయం వెల్లడించారు. ఎన్నికల తర్వాత పార్టీ మారేవాళ్లు చాలామంది ఉంటారనీ, కానీ తనకు అంత తెలివి లేక, చేతకాక ముందే పార్టీ మారానని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-behind-konda-vishweshwar-reddy-quits-trs-party--39-84660.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.