మంటలు రగిల్చిన ఆర్ డి ఎస్ ప్రాజెక్ట్
Publish Date:Mar 31, 2012
Advertisement
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్ డి ఎస్) నీటి ప్రాజెక్టు తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ ప్రాజెక్టు నీటి వాడకంపై తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లా, రైతాంగం, రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్ జిల్లా రైతాంగం తరచు ఘర్షణలకు దిగుతున్నారు. ఈ నేపద్యంలో ఆర్ డి ఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామ్ రెడ్డి కర్నూల్ కు నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ డి ఎస్ ప్రాజెక్టు నీటి పంపకం విషయమై గత కొద్ది కాలంగా ఈ రెండు జిల్లాల మధ్య తరచ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. నిజం కాలం నాటి పాత ఒప్పందం ప్రకారం ఆర్ డి ఎస్, కెసి కాలువలకు 40:60 నిష్పత్తి నీటి వాటాలున్నాయని ఆర్ డి ఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామ్ రెడ్డి అంటున్నారు. అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలైన మొత్తం నీటిని నిబంధనలకు విరుద్ధంగా సీమ ప్రాంతానికి తరలించేందుకు ఆనకట్ట వద్ద ఆర్ డి ఎస్ షట్టర్లను మూసివేశారని ఆయన ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులను, ప్రాజెక్టు కమిటీ సభ్యులను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా షట్టర్లను మూయించడంపై ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే కర్నూల్ జిల్లా రైతాంగం వాదలో మరోలా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం కాలువనీటిని కర్మూలు జిల్లాలోకి రాకుండా చేయడానికి ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల కర్నూల్ జిల్లాలో వందలాది ఎకరాల పంటలు, ఎండిపోతున్నాయని, రైతాంగం నష్టపోతుందని కర్నూల్ జిల్లా నాయకులు అంటున్నారు. కాలువ ప్రవాహానికి అడ్డుగా ఇసుక బస్తాలు వేస్తే సహించేది లేదని, అవసరమైతే తమ ప్రాణాలు త్యజించి తమ హక్కులను కాపాడుకుంటామని కర్నూల్ జిల్లా రైతాంగం అంటోంది. మరోవైపు ఆర్ డి ఎస్ నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన నీటి వాటాను ఇవ్వకపోతే ఆందోళనలను మరింత ఉద్రేకం చేస్తామని సీతారామ్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rajolibanda-diversion-scheme-24-13056.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





