మంటలు రగిల్చిన ఆర్ డి ఎస్ ప్రాజెక్ట్

Publish Date:Mar 31, 2012

Advertisement

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్ డి ఎస్) నీటి ప్రాజెక్టు తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ ప్రాజెక్టు నీటి వాడకంపై తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లా, రైతాంగం, రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్ జిల్లా రైతాంగం తరచు ఘర్షణలకు దిగుతున్నారు. ఈ నేపద్యంలో ఆర్ డి ఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామ్ రెడ్డి కర్నూల్ కు నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ డి ఎస్ ప్రాజెక్టు నీటి పంపకం విషయమై గత కొద్ది కాలంగా ఈ రెండు జిల్లాల మధ్య తరచ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. నిజం కాలం నాటి పాత ఒప్పందం ప్రకారం ఆర్ డి ఎస్, కెసి కాలువలకు 40:60 నిష్పత్తి నీటి వాటాలున్నాయని ఆర్ డి ఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామ్ రెడ్డి అంటున్నారు.

 

అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలైన మొత్తం నీటిని నిబంధనలకు విరుద్ధంగా సీమ ప్రాంతానికి తరలించేందుకు ఆనకట్ట వద్ద ఆర్ డి ఎస్ షట్టర్లను మూసివేశారని ఆయన ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులను, ప్రాజెక్టు కమిటీ సభ్యులను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా షట్టర్లను మూయించడంపై ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే కర్నూల్ జిల్లా రైతాంగం వాదలో మరోలా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం కాలువనీటిని కర్మూలు జిల్లాలోకి రాకుండా చేయడానికి ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల కర్నూల్ జిల్లాలో వందలాది ఎకరాల పంటలు, ఎండిపోతున్నాయని, రైతాంగం నష్టపోతుందని కర్నూల్ జిల్లా నాయకులు అంటున్నారు. కాలువ ప్రవాహానికి అడ్డుగా ఇసుక బస్తాలు వేస్తే సహించేది లేదని, అవసరమైతే తమ ప్రాణాలు త్యజించి తమ హక్కులను కాపాడుకుంటామని కర్నూల్ జిల్లా రైతాంగం అంటోంది. మరోవైపు ఆర్ డి ఎస్ నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన నీటి వాటాను ఇవ్వకపోతే ఆందోళనలను మరింత ఉద్రేకం చేస్తామని సీతారామ్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.

 

 

By
en-us Political News

  
 స్టేషన్‌ బయట సదరు కానిస్టేబుల్‌ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు   రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ  విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.   ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.  
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.