యువరాజవారి ప్రవచనాలు

Publish Date:Dec 21, 2013

Advertisement

 

యువరాజవారు “నాన్సెన్’ అని అన్నంత మాత్రానే ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు సైతం చిరిగి చెత్త బుట్టలోకి తరలిపోతాయి. ఆయన కనుసైగ లోక్ పాల్ బిల్లు ఎగురుకొంటూ పార్లమెంటు ఆమోదం పొందేస్తుంది. ఆయన తీక్షణంగా చూస్తే చాలు...కొమ్ములు తిరిగిన కేంద్ర మంత్రులు కూడా తత్తరపడుతూ తమ పదవులకు రాజీనామాలు చేసేసి, పార్టీ సేవకి బిరబిరా పరుగులు తీస్తారు. మరి ఇంత పవర్ఫుల్ యువరాజవారు మనదేశంలో అనేక వ్యవస్థలు కొంత మంది వ్యక్తుల చెప్పుచేతలలో నడవడం చాలా అన్యాయమని వాపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఎఫ్‌ఐసిసిఐ -ఫిక్కీ) సమావేశంలో యువరాజవారు దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం, వ్యవస్థలో అవినీతి పీల్చిపిప్పి చేసేస్తున్నాయని పాపం! చాలా బాధపడిపోయారు.

 

ఇంత బాధపడుతున్నమన మోస్ట్ పవర్ఫుల్ యువరాజవారు ఉల్లిపాయలు మొదలు బియ్యం, పప్పులు, నూనెల వరకు ప్రతీ వస్తువుల ధరలు రెక్కలు కట్టుకొని ఆకాశానికి ఎగిరిపోతూ సామాన్యుడి బ్రతుకుభారం చేస్తుంటే మరి దానిని అరికట్టడానికి ఆయన ఏమి చేసారు? ఆయన ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్నశరత్ పవార్ మహారాష్ట్రలో ఉల్లి, చెరుకు, పంచదార మార్కెట్లను తన గుప్పిట్లో పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తుంటే యువరాజవారు ఎందుకు చూస్తూ ఊరుకోవలసి వచ్చింది?

 

కోట్లాది ప్రజలు, పసిపిల్లలు ఒకపూట అన్నానికి కూడా నోచుకొక ఆకలి చావులు చస్తుంటే, మరోవైపు గోదాములలో లక్షలాది టన్నుల బియ్యం, గోధుమలు ముక్కిపోతుంటే కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదిలించినా యువరాజవారు ఎందుకు మేల్కొనలేదు? సమస్యలను గుర్తించినప్పుడు వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా, పేదరికం గురించి, సామన్యుల సమస్యలు, కష్టాల గురించి ఎంతో బాధపడిపోతూ ఎన్నిఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా వాటివలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

 

అధికారం, ప్రభుత్వం అన్నీతన చేతిలో ఉంచుకొని, “సమస్యలు తీర్చవలసి ఉంది. అవినీతిని తొలగించవలసి ఉంది. అధిక ధరలు తగ్గించవలసి ఉంది. ప్రభుత్వం పనిచేయవలసి ఉంది” అంటూ ప్రజల వద్దకు వచ్చి చెప్పడం తమ చేతకాని తనాన్ని ప్రదర్శించుకోవడమే.

 

ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహ ప్రయోగంలో విఫలమయితే, అది ఎందుకు విఫలమయిందో తెలుసుకొని ఆలోపాలను సవరించుకొంటూ ముందుకు సాగుతున్నందేనే నేడు వారు మనదేశానికి గర్వకారణమయిన ‘మంగళ యాన్’ న్ని దిగ్విజయంగా ప్రయోగించగలిగారు. మరి అదేవిధంగా దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేటికీ తమ ప్రభుత్వంలో, వ్యవస్థలలో లోపాలను సరిచేయడంలో ఎందుకు అశ్రద్ద వహిస్తోంది? అంటే దానికి చిత్తశుద్ది కొరవడటమే కారణమని చెప్పవచ్చును.

 

ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నమన యువరాజవారు, తను గుర్తించిన ఈ సమస్యలను సవరించడానికి, సరిద్దదానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఇలా మైకు, ప్రేక్షకులు, అవకాశం దొరికినప్పుడల్లా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం వలన ఏమి ప్రయోజనం? మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆ మాటలకు కూడా ఎటువంటి విలువ ఉండదు. అదే పొంతన ఉంటే అది అమాద్మీలా తిరుగులేని ప్రజామోదం పొందుతుందని రుజువయింది కూడా. ప్రజలలో ఇంత రాజకీయ చైతన్యం చూసిన తరువాత కూడా వారిని ఇంకా ఇంకా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో మెప్పించగలమని ఆయన భావిస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీయే నష్టపోవడం తధ్యం.

By
en-us Political News

  
ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు.
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.