కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి యువరాజా వారు వచ్చేశారు

Publish Date:Apr 17, 2015

Advertisement

 

సుమారు రెండు నెలలుగా అదృశ్యమయిపోయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు తిరిగి వచ్చేరు. పార్టీని ఏవిధంగా ముందుకు నడిపించాలి? అందుకు ఎటువంటి విధానాలు అవలంభించాలి? వంటి ముఖ్యమయిన విషయాల గురించి ఆలోచించేందుకు ఆయన రెండు వారాలు ‘రాజకీయాలకు శలవు’ తీసుకొని వెళ్ళారని కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకొంది. పార్టీ ఉపాధ్యక్షుడుగా రాహుల్ గాంధీ ఒకవేళ పార్టీ గురించి ఆలోచించదలిస్తే పార్టీలో ముఖ్య నేతలతో కలిసి కూర్చొని ఆలోచించాలి. కానీ ఆయన ఉరుగ్వే, మయన్మార్, తాయ్ ల్యాండ్ దేశాలలో ఒంటరిగా చక్కర్లు కొట్టి వచ్చేరు. దానితో ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రతిపక్షాలకు ఆయన శలవు గురించి కాకమ్మ కధలు చెప్పిందని స్పష్టమయింది.

 

ఆయన డిల్లీకి తిరిగి రాక ముందే కాంగ్రెస్ నేతల మాటలలోనే అసలు విషయం బయటపడింది. పార్టీలో సీనియర్ల వైఖరి, వారు (తనను పక్కనబెట్టి) పార్టీని నడిపిస్తున్నతీరు చూసి అలిగి శలవు తీసుకొన్నారని కాంగ్రెస్ నేతలే పరోక్షంగా చెప్పుకొన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయనకీ మధ్య కూడా అనేక విషయాలలో భేదాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి వారే చెప్పుకొన్నారు. అయితే అది కేవలం తరాల అంతరం (జనరేషన్ గ్యాప్) మాత్రమేనని మళ్ళీ వారే కలరింగ్ ఇచ్చుకొన్నారు.

 

అదే విధంగా ఆయన శలవు మీద వెళ్లినప్పటి నుండి తిరిగి వచ్చేవరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఆయన నాయకత్వ లక్షణాలు, సమర్ధత గురించే చర్చ జరగడం చూస్తే ఆ పార్టీకి ప్రధాన సమస్య రాహుల్ గాంధీయేనని వారు భావిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఆ కారణంగానే కొందరు సోనియాగాంధీ గ్రూపుగా మరికొందరు రాహుల్ గాంధీ గ్రూపుగా తయారయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ముఠాలు కట్టడం కొత్తేమీ కాదు. కానీ ఏకంగా పార్టీని నడిపిస్తున్న ఆ తల్లి కొడుకులకే రెండు ముఠాలు తయారవడం విచిత్రం. ఇటువంటి విచిత్రం మరే పార్టీలో కనబడదు.

 

ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ, తన పార్టీని ఏవిధంగా బ్రతికించుకోవాలా...అని ఆలోచించే బదులు, ఏవిధంగా పార్టీని తన అదుపులోకి తీసుకోవాలా...అని ఆలోచించడమే వింత. ఆయన తన నాయకత్వ లక్షణాలు, సమర్ధతను నిరూపించుకోగలిగి ఉండి ఉంటే ఆయన పార్టీ మీద పట్టు సాధించేందుకు ఈవిధంగా శలవు తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు.

 

ఒకప్పుడు మారుమూల గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, అరవై ఏళ్లగా సాధించలేని తెలంగాణాను కేవలం పదేళ్ళలో సాధించిన కేసీఆర్, పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగిన చంద్రబాబు నాయుడు, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ యన్టీఆర్, రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిష్టుల కంచుకోటను బ్రద్దలు కొట్టిన వీర నారీమణి మమతా బెనర్జీ, కొమ్ములు తిరిగిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మట్టి కరిపించిన అరవింద్ కేజ్రీవాల్ వంటి వారందరూ తమ నాయకత్వ లక్షాణాల వలననే పార్టీపై పూర్తి పట్టు సాధించారు తప్ప రాహుల్ గాంధీలాగ ఎక్కడికో పారిపోయి పార్టీపై పట్టు సాధించాలనుకోలేదు.

 

మోడీ, చంద్రబాబు, కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటివారందరూ తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో సైతం ఏ మాత్రం నిబ్బరం కోల్పోకుండా పార్టీని ఒక్క త్రాటిపై ముందుకు నడిపించి విజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. కానీ రాహుల్ గాంధీకి ఆయన తల్లి సోనియా గాంధీ అన్నీ విస్తర్లో వడ్డించి అందజేసినా అందుకోలేకపోయారు. చివరికి డా. మన్మోహన్ సింగ్ అంతటివాడి చేత ఆయన కోసం ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ చేయించడానికి కూడా ఆమె సిద్దపడినా రాహుల్ గాంధీ అందులో కూర్చోవడానికి భయపడ్డారు.

 

ఈరోజు పార్టీ పగ్గాలు తనకే దక్కాలని కోరుకొంటున్న రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ పగ్గాలు అందుకొని ఉండి ఉంటే, పార్టీ ఓడిపోయినా అందరూ ఆయన వెంటే ఉండేవారు. కనీసం లోక్ సభలో పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆయన దైర్యం చేయలేక హాయిగా వెనుక బెంచీలలో కునుకు తీసారు. అటువంటి వ్యక్తిపై ప్రజలకే కాదు పార్టీలో నేతలకయినా ఎందుకు నమ్మకం కలుగుతుంది? అయితే ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో నేతలు వ్యతిరేకించవచ్చునేమో గానీ బీజేపీతో సహా దేశంలో మరే ఇతర పార్టీ వ్యతిరేకించదు. ఎందుకంటే తమ పార్టీలు పదికాలాలపాటు చల్లగా అధికారంలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆయనే నాయకుడిగా ఉండాలని వారు ఆశపడటం సహజమే.

 

నెహ్రు కుటుంబంలో పుట్టడం ఒక్కటే తనకున్న ఏకైక అదనపు అర్హత అని రాహుల్ గాంధీయే ఒకప్పుడు స్వయంగా చెప్పుకొన్నారు. మరి ఇప్పుడు ఆయన అదే ప్రత్యేక అర్హతతోనే కాంగ్రెస్ పార్టీపై పెత్తనం చేయాలని ఎందుకు భావిస్తున్నట్లు? గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని కుర్చీలో, పార్టీ అధ్యక్ష కుర్చీలో కూర్చోవడానికి తనకు తగిన అర్హత లేదని జంకిన వ్యక్తి, ఇప్పుడు హటాత్తుగా పార్టీకి సారధ్యం వహించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారు? ఆయన నాయకత్వ లక్షణాలను సమర్ధతను పార్టీలో నేతలే ప్రశ్నిస్తున్నప్పుడు, తను మిగిలిన సీనియర్ల కంటే ఏవిధంగా సమర్ధుడని ఆయన భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు అడుగుతున్నది ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే అడుగుతున్నారు. ఏమయినప్పటికీ ఇన్ని అవకాశాలు వచ్చినా తన సమర్ధతను నిరూపించుకోలేక రాజకీయాలకు శలవు పెట్టిన వ్యక్తి చేతిలో కాంగ్రెస్ పార్టీని పెడితే ఏమవుతుందో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.