పోలవరం కోసం ఇంత ఆవేదన...మరెవరికీ లేదేమో

Publish Date:Apr 16, 2015

Advertisement

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తన పార్టీ యం.యల్యే.లతో కలిసి మూడు రోజుల బస్సు యాత్రకు బయలుదేరారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో పర్యటించిన తరువాత జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఏడాదికి రూ.4000 కోట్లు ఖర్చు చేయగలిగితే చాలు...నాలుగేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చును. కానీ ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం దానిమీద కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకే పోలవరం ప్రాజెక్టుని పక్కనబెట్టారు,” అని విమర్శించారు.

 

గత పదేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పరిపాలించింది. అందులో ఐదేళ్ళపాటు రాజశేఖర్ రెడ్డే స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఆయనకు కేంద్రం వద్ద మంచి పలుకుబడి ఉండేది కూడా. అయినా ఆయన పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేయలేకపోయారు. జలయజ్ఞం పేరిట వేల కోట్ల రూపాయలు ఆయన హయంలోనే ఖర్చు చేసారు. కానీ పోలవరం ప్రాజెక్టుతో సహా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏడాదికి రూ.4,000 కోట్లు ఖర్చు చేయగలిగితే చాలు...నాలుగేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని జగన్మోహన్ రెడ్డి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు మరి అదే విషయం తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి చెప్పి ఆయన హయాంలోనే పూర్తి చేయించి ఉండవచ్చును. లేదా ఆయన తరువాత పరిపాలించిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ వహిస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండి ఉంటే అప్పుడూ ఇదేవిధంగా బస్సు యాత్రలు, ధర్నాలు చేసి వారిపై ఒత్తిడి చేసి ఉండవచ్చును. కానీ అప్పుడు ఓదార్పు యాత్రలతో కాలక్షేపం చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి తెగ ఆవేదన పడిపోవడమే విచిత్రంగా ఉంది. పైగా వచ్చే ఎన్నికలలోగా ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నప్పటికీ, దానిని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు గుప్పించడం ఎందుకు? ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయలేకపోతే అప్పుడు నిలదీసినా అర్ధం ఉంటుంది. కానీ పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా చర్యలు చేపడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా ఆరోపణలు గుప్పించడం కేవలం రాజకీయ లబ్ది కోసమేనని భావించవలసి ఉంటుంది.

 

పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం చేప్పట్టి ఇంకా ఏడాది కూడా పూర్తికాక ముందే ప్రాజెక్టుని ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించడం అవివేకం.

 

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తమే. అదే నిజమయితే ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వందల కోట్ల సొమ్ముని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రీ-ఇంబర్స్ చేస్తోంది?

 

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయిన తరువాత నుండే ఈ పోలవరం గురించి చర్చ మొదలయ్యింది. పనులు కూడా వేగవంతం అయ్యాయనే విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వాలు మారిన తరువాతనే రాష్ట్రాభివృద్ధి గురించి అనేక ఆలోచనలు, ప్రణాళికలు, కార్యక్రమాలు, నిధులు మంజూరు అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో అనేక ఇతర అబివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇవేవీ కనిపించకపోవడం విచిత్రమే.

 

జగన్ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లున్నారు తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనే తపన మాత్రం ఆయనలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.