పాముకు పాలు పోసినా కాటేస్తుంది

Publish Date:Apr 18, 2015

Advertisement

 

ప్రపంచంలో భారతదేశంతో సహా అనేక దేశాలు ఉగ్రవాదానికి బలవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ వంటి దేశాలు భయంకరమయిన విషసర్పాల వంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తునే ఉన్నాయి. పాము తన పిల్లలను తానే చంపి తిన్నట్లుగా వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు చివరికి వారి పిల్లలను, ప్రజలనే అతి కిరాతకంగా చంపుతున్నారు. అయినా పాక్ ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ నిర్వాకానికి భారత్ కూడా మూల్యం చెల్లించవలసిరావడం ప్రతీ భారతీయుడికి చాలా కష్టం అనిపిస్తుంది.

 

పాకిస్తాన్ నిర్వాకం ఎలా ఉన్నా రెండు నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూడా సరిగా అటువంటి నిర్వాకమే చేస్తూ భారత్ కు మరిన్ని కొత్త సమస్యలు, సవాళ్ళు, కష్టాలు తెచ్చిపెడుతున్నారిప్పుడు.

 

కాశ్మీర్ వేర్పాటు వాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ పై దయ తలచబట్టే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకోగలిగామని ప్రకటించిన ఆయన అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకొన్నారు. అధికారం చేప్పట్టి నెల తిరుగక ముందే మసరత్ ఆలం అనే కరడుగట్టిన వేర్పాటువాదిని మూడో కంటికి తెలియకుండా జైలు నుండి విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు.

 

అతను నాలుగు రోజుల క్రితం శ్రీనగర్ లో ఒక భారీ ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేసి అందులో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించారు. అంతకు ముందు రోజే ఆయన ఆక్రమిత కాశ్మీర్ నుండి ప్రసారమవుతున్న ఒక రేడియో చానల్ ద్వారా భారత వ్యతిరేక ప్రసంగం చేసారు కూడా.

 

కాశ్మీర్ వేర్పాటువాదిగా పేరుమోసిన సయీద్ గిలానీ డిల్లీలో ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని శ్రీనగర్ తిరిగి వస్తున సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు మసరత్ ఆలం ఆ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడం, అందులో పాకిస్తాన్ జెండాలను ఎగురవేసినా ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కు అందులో ఎటువంటి తప్పు కనిపించలేదు. చివరికి నిరసనకారులు భారత జెండాను బహిరంగంగా తగులబెట్టినా ఆయనకు అందులో తప్పేమీ కనబడలేదు. అది విభిన్న వ్యక్తుల భిన్నాభిప్రాయాలకు ప్రతీక అని సర్దిచెప్పుకొన్నారు.

 

కానీ ఆయన తన తీరు మార్చుకోకపోతే ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని బీజేపీ గట్టిగా హెచ్చరించడం, కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి గట్టిగా మందలించిన తరువాతనే ఆయన భారత్ కు వ్యతిరేకం గా వ్యవహరిస్తున్న మసరత్ ఆలం, గిలానీలని అరెస్ట్ చేయించారు. కానీ వారిలో గిలానిని మాత్రం జైలుకి తరలించకుండా గృహ నిర్బంధంలోనే ఉంచారు. అంటే ఆయనకి ఇప్పటికీ స్వేచ్చ ఉన్నట్లే భావించవచ్చును.

 

మసరత్ ఆలంని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళుతున్నప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజలు వేర్పాటువాద సంస్థ హురియత్ నేతృత్వంలో తమ పోరాటాలు కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

శ్రీనగర్ కి సుమారు 50కిమీ దూరంలో పుల్వామా జిల్లాలోగల ట్రాల్ పట్టణంలో వారం రోజుల క్రితం భద్రత దళాలకి ఉగ్రవాదులకి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. అందులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. కానీ చనిపోయిన వారిరురువూ సామాన్య పౌరులేనని, కనుక వారిని ఎన్కౌంటర్ చేసిన భద్రతా దళాలపై కేసు నమోదు చేయాలని, కాశ్మీర్ లోయ నుండి భారత భద్రతా దళాలను తక్షణమే ఉపసంహరించాలని మసరత్ ఆలం ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. గత మూడు నాలుగు రోజులుగా నౌహట్ట మరియు ట్రాల్ ప్రాంతాలలో ప్రజలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ తమను అడ్డుకొంటున్న భద్రత దళాలపై రాళ్ళు రువ్వుతున్నారు. వారి దాడిలో భద్రత దళాలకు చెందిన 29 మంది గాయపడ్డారు. గత నాలుగయిదు రోజులుగా నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్ళు రువ్వడం, వారిని నిలువరించేందుకు భద్రతా దళాలు తిరిగి వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో శ్రీనగర్ ప్రాంతం అట్టుడుకుతోంది.

 

క్రమంగా జమ్మూ కాశ్మీర్ లోయలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మళ్ళీ తిరుగుబాటు, అల్లర్లు, హింస మోదలయ్యాయి. దీనికంతటికీ కారణం ఎవరు? ఏమిటి? అని ప్రశ్నించుకొంటే ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, అయన చేసిన నిర్వాకమేనని చెప్పక తప్పదు. అతనిని విడుదల చేయడం వలన రాష్ర్టంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతాయని ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని సమర్ధించుకొన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? గతంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయిన మసరత్ ఆలంని జైలు నుండి విడుదల చేసిన తరువాతనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ సమస్యలు మొదలయ్యాయి.

 

భారత గడ్డపై ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న అటువంటి ముఖ్యమంత్రికి, అయన ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇవ్వడం ఆ ప్రభుత్వంలో అధికారం పంచుకోవడం ఎంతవరకు సమంజసమో బీజేపీయే ఆలోచించుకోవాలి. దాని వలన మున్ముందు జరుగరానిది ఏదయినా జరిగినట్లయితే అందరూ బీజేపీనే నిందించకమానరు. చేతులు కాలే వరకు వేచి చూడటం కంటే, అటువంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసి ఉన్నప్పుడు ముందే దానిని నివారించే ప్రయత్నం చేస్తే మంచిది కదా.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.