Publish Date:Nov 23, 2012
ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకవైపు వికెట్లు పడుతున్న పుజారా మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. మొదటి టెస్టులో డబుల్ సెంచరి చేసిన పుజారా, రెండో టెస్టులో కూడా సెంచరీతో ఇండియాకి అండగా నిలిచాడు. అశ్విన్ కూడా హాఫ్ సెంచరీతో పుజారాకి మంచి సహకారం అందిస్తున్నాడు. తన వందో టెస్టు మ్యాచులో శతకం చేస్తాడని ఆశించిన వీరేంద్ర సెహ్వాగ్ అబిమానులను నిరాశపరిచాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పనేసర్ నాలుగు వికెట్లు, అండర్సన్ ఒకటి, స్వాన్ ఒక వికెట్ తీశారు. 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల వద్ద ఆట ముగిసింది.
ఇండియా స్కోర్ వివరాలు : గౌతమ్ గంభీర్ : 4, సెహ్వాగ్ : 30, పుజారా (నాటౌట్) : 114, సచిన్ : 8, కోహ్లీ : 19, యువరాజ్ సింగ్: 0, కెప్టెన్ ధోనీ : 29, అశ్వీన్ (నాటౌట్) : 60, ఎక్స్ట్రా : 2.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pujara-century-helps-india-36-19272.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.