ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. ముంబై ఇండియన్స్పై క్లాసెన్ చేసిన అజేయ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 65) తర్వాత పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఒక విజ్ఞప్తి చేశాడు.
2027లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్లో సఫారీలు విజేతగా నిలవాలంటే, క్లాసెన్ వంటి ఆటగాడు జట్టులో ఉండాలని సూచించాడు. ఇందుకోసం క్లాసెన్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునేలా అధికారులు ఒప్పించాలని కోరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రతీ మ్యాచులోనూ పరుగులు చేస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బుధవారం (29-4-26న)ముంబై ఇండియన్స్తో జరిగిన ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ 30 బంతుల్లోనే 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన క్లాసెన్.. సుమారు 60 సగటుతో 414 పరుగులు స్కోరు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pietersen-has-faith-in-sunrisers-star-klaasen-36-218757.html
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.