ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బాలికను వేధించిన కీచక ఉపాధ్యాయుడు!

Publish Date:Jun 22, 2026

Advertisement

కృత్రిమ మేధస్సు(ఏఐ) సాంకేతికత మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతోంది నిజమే.. కానీ..  కొందరు దీనిని దుర్మార్గాలు కూడా వాడేస్తున్నారు. సమాజానికి హాని కలిగించేందుకు ఇందుకు వినియోగిస్తున్నారు.   తాజాగా  విశాఖపట్నంలో సాంకేతికతను  ఒక ట్యూషన్ టీచర్ దుర్వినియోగం చేసిన తీరు విస్మయపరిచేలా, ఏఐ అంటేనే భయపడేలా ఉంది.   విద్యా బుద్ధులు  నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి..  ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల కథనం   నిందితుడు  షణ్ముఖ్ హితేష్‌ తన వద్ద రెగ్యులర్‌గా ట్యూషన్ నేర్చుకోవడానికి వచ్చే ఒక మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని.. ఆ బాలికకు సంబంధించిన ఫొటోలను సేకరించాడు. ఆ తర్వాత ఏఐ టూల్స్ ఉపయోగించి, ఆ  ఫొటోలను  అశ్లీలంగా  మార్ఫింగ్ చేశాడు. వాటిని  చూపించి సదరు బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

తనకు లొంగకపోతే.. ఈ  మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాననీ,  ఇతరులందరికీ పంపిస్తానని ఆ మైనర్ బాలికను  బెదరించాడు.  నిందితుడు షణ్ముఖ్ హితేష్   వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో, ఆ బాలిక   విషయాన్ని తన తల్లిదండ్రులకు  చెప్పింది. వారు వెంటనే..  విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు  లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు షణ్ముఖ్ హితేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై  పోక్సో చట్టంతో పాటు, ఐటీ యాక్ట్‌లోని  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.
కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే దేశంలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన రాజీనామాకు దారితీసిన ముఖ్య కారణాలు ఏంటంటే.. గత మే నెలలో జరిగిన బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి స్టార్మర్ నాయకత్వ సామర్థ్యంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తింది.
భారతీయ రైల్వేస్ థర్మల్ ప్లాంట్ల నుండి 340 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ (బొగ్గు బూడిద) రవాణా కోసం సరికొత్త మెగా లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. 40 శాతం డిస్కౌంట్‌తో సిమెంట్, ఇటుకల ధరలను తగ్గించి, వ్యర్థాలను జాతీయ సంపదగా మార్చే ఈ అద్భుతమైన గ్రీన్ ఇనిషియేటివ్ విశేషాలు ఇక్కడ చదవండి.
కర్ణాటకలో ప్రభుత్వ బస్సు ప్రయాణం మరింత ప్రియం కానుంది. డీజిల్ ధరలు, ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు రూ. 6,000 కోట్ల అప్పుల్లో ఉన్న రవాణా సంస్థలు 12% వరకు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం కేరళ పోలీసులు, దేవస్వం బోర్డు అధునాతన ఏఐ (AI) డ్రోన్లు, స్మార్ట్ కెమెరాలను ప్రవేశపెడుతున్నారు. గత ఏడాది 51 లక్షల మంది భక్తులు దర్శించుకున్న నేపథ్యంలో, తొక్కిసలాటలు నివారించడానికి మరియు 26 పార్కింగ్ స్థలాలను డిజిటలైజ్ చేయడానికి ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ శాంతి చర్చల వేదిక ఒక్కసారిగా రచ్చరచ్చగా మారిపోయింది. అనూహ్య దౌత్య వివాదాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నారా? ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి మరియు మార్కెట్ నిపుణుల కీలక విశ్లేషణ, బంగారం ధరల తాజా అంచనాలు మీకోసం.
ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే మొట్టమొదటిసారిగా హాంగ్‌కాంగ్ వేదికగా జరగనున్న పూమా హైరాక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2027 (PUMA HYROX 2027) పూర్తి వివరాలు, రికార్డు గణాంకాలు ఇక్కడ చూడండి
హైదరాబాద్‌లో సంచలన గోల్డ్ స్కామ్...
వేటకు వెళ్లిన కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలలకు అరుదైన మత్స్య సంపద చిక్కింది. వారు వేసిన వలలో ఏకంగా లక్షల రుూపాయల విలువైనఅరుదైన కచిడి చేపలు మూడు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత సముద్రంలోకి వెళ్లిన తొలి వేటలోనే ఇలాంటి అరుదైన చేపలు వలకు చిక్కడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం..
పాలమూరు జిల్లా దేవరకద్ర వద్ద డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ ప్రతిపాదించిన కీలక రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్రంతో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.