అమెరికా, ఇరాన్ చర్చలు.. అమెరికా ఉపాధ్యక్షుడికి అవమానం?

Publish Date:Jun 22, 2026

Advertisement

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సుదీర్ఘ అశాంతికి స్వస్తి పలికి, శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం (జూన్ 21) స్విట్జర్లాండ్‌  చర్చా వేదికగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి దౌత్య ప్రతినిధులు ఒకే టేబుల్ పైకి వచ్చి చర్చలు జరపడం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి కూడా వ్యక్తమైంది.  అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ శాంతి చర్చల వేదిక ఒక్కసారిగా  రచ్చరచ్చగా మారిపోయింది. అనూహ్య  దౌత్య  వివాదాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే  అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

 ఒక కీలకమైన ప్రోటోకాల్ ఉల్లంఘన కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడికి తీవ్ర అవమానం జరిగింది. దౌత్యపరమైన నిబంధనల ప్రకారం లభించాల్సిన గౌరవం,  భద్రత విషయంలో లోపాలు తలెత్తాయి. దీనిపై అమెరికా ప్రతినిధి బృందం తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసింది. ఈ  కారణంగా చర్చల ప్రాంగణంలో కొద్ది సేపు తీవ్ర గందరగోళం నెలకొంది.  ఇరాన్ ప్రతినిధులు కూడా తమ పాత వైఖరిని ప్రదర్శిస్తూ అమెరికా విధించిన ఆంక్షలపై కఠినమైన వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం వేడెక్కింది.

ఈ శాంతి చర్చలపై ప్రపంచవ్యాప్తంగా   ఎన్నో ఆశలు ఉన్నాయి.  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థలు   మెరుగుపడతాయన్న అంచనాలు ఉన్నాయి. అయితే చర్చల ఆరంభంలోనే  అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం, నమ్మకం లేవు అన్న విషయం తేటతెల్లం కావడం అందరినీ నిరాశకు గురి చేసింది.  

అది పక్కన పెడితే..  అమెరికా ఉపాధ్యక్షుడికి జరిగిన ఈ ప్రోటోకాల్ అవమానంపై వైట్ హౌస్ ఇప్పటికే అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఇరాన్ కూడా ఈ చర్చల్లో తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చర్చల నుండి పూర్తిగా తప్పుకుంటామని హెచ్చరించింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ ల పుణ్యమా అని ఈ వివాదం టీకప్పులో తుపానుగా మారి.. చర్చలు సానుకూలంగా సాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

By
en-us Political News

  
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే ముగిసినా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై 70 శాతం వరకు భారీ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. డ్రీమ్, రోబోరాక్ మరియు ఎకోవాక్స్ బ్రాండ్లపై లభిస్తున్న క్రేజీ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం, జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వాటికి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు.
అమెరికా ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు ట్రంప్ ప్రతిపాదిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ అంటే ఏమిటి? పౌరులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జులై 17 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల తులం పసిడి ధరలపై రూ.760 వరకు తగ్గుదల నమోదైంది. నేటి లేటెస్ట్ గోల్డ్ రేట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బులియన్ మార్కెట్లో బంగారం వెండి నిష్పత్తి 69 కి చేరింది. 2026 లో 80 మార్కు దాటిన ఈ రేషియో ప్రస్తుతం సాధారణ స్థితికి రావడంతో ఏ లోహంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి భవిష్యత్ పెట్టుబడులపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బంగారం, ఆయిల్ కంటే నీటి హక్కులకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు.
భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచడంతో, ఈసారి భూమార్గాలను విడిచిపెట్టి జలమార్గాల ద్వారా చొరబడేందుకు వాటర్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వాటర్ ఫోర్స్ నీటి అడుగున ఉండి పోరాడేందుకు ఇస్తున్న శిక్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో లష్కరే ఉగ్రకుట్ర బయటపడింది.
అమెరికాలో ఓటింగ్ విధానాన్ని మార్చేందుకు డోనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act 2026 బిల్లు విశేషాలు, పౌరసత్వ నిరూపణ నిబంధనలు మరియు దీనివల్ల ఓటర్లపై పడే ప్రభావం గురించిన పూర్తి వివరాలు.
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? జూలై 19న లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ హిట్ మ్యాన్ కెరీర్‌లో చివరిదా? అసలు నిజమేంటో ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.