వాడిగా వేడిగా కిరణ్ ప్రసంగాలు ... ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ ... టి.ఆర్.ఎస్. ...

Publish Date:May 21, 2012

Advertisement

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మాటలకు పదనుపెట్టి ఘాటైన పదజాలంతో ఒకవైపు జగన్ నూ, మరోవైపు టి.ఆర్.ఎస్. నూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రత్యేకించి జగన్ తో టి.ఆర్.ఎస్.కు ఉన్న సంబంధాలను ప్రస్తావించకుండా ఆయన ప్రసగ్నాన్ని ముగించటం లేదు. ఇంతవరకూ ప్రత్యేక తెలంగాణాకు తాను వ్యతిరేకం కాదన్న సిఎం ఉప ఎన్నికల సందర్భంగా (ఎన్నికలు జరిగే 18 స్థాన్నాల్లో 17 అసంబ్లీ స్థానాలు సీమాంధ్రలోనివే) రాష్ట్ర విభజనపై కర్ర విరగాకూడదు ... పామూ చావకూడదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.

 

 

ఇటీవల జరిగిన ఉదంతాలను ఉదాహరిస్తూ సిఎం తాను చేసే ప్రసంగం ఆసక్తికరంగా సాగేందుకూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వై.ఎస్.లానే ఈయన కూడా చేతులు ఊపుతూ ఆవేశపూరితమైన పదాలను ఉచ్చరిస్తున్నారు. ఓ సందర్భంలో వై.ఎస్.తాను తెలంగాణాకు అడ్డమూ. నిలువూ కాదని సంచలనమైన వ్యాఖ్య చేశారు. అదే విధంగా సిఎం మాటల్లో ... "తన తండ్రి వ్యతిరేకించిన తెలుగుదేశం, మతతత్వపార్టీగా ముద్ర వేయించుకున్న బిజెపిలతో జతకట్టిన జగన్ ఏమి చేసేందుకైనా వెనుకాడదు. ఆ రెండు పార్టీలే వై.ఎస్.కు సిద్ధాంతపరంగా బద్ధశత్రువులన్న విషయాన్ని జగన్ మరిచాడు. అందుకే నన్ను దించాలని ఆ రెండు పార్టీలను సహాయం అర్థించాడు. ఇంకా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు చూస్తున్న టి.ఆర్.ఎస్.తో జతకట్టాడు. అందుకే గత ఎన్నికల్లో తెలంగాణా లో పోటీకి ఎవరినీ నిలబెట్టలేదు. అసలు ఈ సంబంధం సక్రమమేనా అని నేను ప్రశ్నిస్తున్నాను.

 

జగన్ కు ఏమైనా నీతి ఉందా అని ప్రశ్నిస్తున్నాను. టి.ఆర్.ఎస్.కు మద్దతు ఇచ్చిన జగన్ సమైక్యవాడా అని నేను అడుగుతున్నాను. మీరే చెప్పండి! అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా మారిన జాగర్ రాష్ట్రాన్ని పాలిస్తారా? లేక ఇంకా దోచేస్తారా? ఏమైనా తన అధికారం కోసం ఎన్నికల నిబంధనలన్నీ పాతరేస్తాడు. రోడ్డుషోలో మందు బాటిల్స్ పంచుతూ పోయిన జగన్ నీతి గురించి ఇంకోసారి చెప్పే పనే లేదు. ఇక పచ్చి అవకాశవాదం ఉన్న టి.ఆర్.ఎస్. గురించి చెప్పాల్సిన పనిలేదు'' ఇలా ఘాటెక్కిన పదాలతో పాటు సిఎం ముఖం కూడా సీరియస్ గా ఉండటంతో ఈ ప్రసంగం వింటున్న వారు అలానే నిలిచిపోతున్నారు. గతంలో చూసిన సిఎం కిరణ్ ఇతనేనా? అనిపించేలా ఈ ప్రసంగాలున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా సిఎం ప్రసంగాల ఘాటుకు సమాధానం చెప్పేందుకు పార్టీలు కూడా తడబడుతున్నాయి. వరుస ఉదాహరణలతో ఆయన ప్రసంగం ఓ ధారలా సాగిపోతోందని పలువురు కాంగ్రెస్ నేతలూ ప్రశంసిస్తున్నారు.

By
en-us Political News

  
విద్యార్థుల హక్కులు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల డిమాండ్ తో  రామచందర్ రావు నేతృత్వంలో బీజేపీ చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాంపల్లి పరిసరాల్లో ఒక్క సారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు.
అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ  సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు.
 మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై సోమవారం  హైకోర్టు విచారించనుంది. 
డిమాండ్ల సాధన కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.  ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  
గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు అధిష్ఠానం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్‌కానా వద్ద ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.