సంక్రాంతి ప్రయాణాల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Publish Date:Jan 9, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి ఆరంభమైపోయింది. పండుగను స్వగ్రామంలో జరుపుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో  తెలుగు రాష్ట్రాల్లో  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి.  రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో  తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రయాణాల సందడే కనిపిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ఇలా అన్ని నగరాలలోనూ  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.   

రద్దీ కారణంగా తోపులాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా అవసరాన్ని బట్టి బస్సు సర్వీసులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఏపీఎస్ ఆర్టీసీ అయితే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.  అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కూడా తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ.. ప్రయాణీకులకు బస్సు సర్వీసుల విషయంలో సమాచారం అందించేందుకు అదనపు సిబ్బందిని కూడా నియమించాయి.  ఈ రద్దీ సంక్రాంతి సెలవులు ముగిసే వరకూ అంటే ఈ నెల  18 వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇక హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాల రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఆరంభమైపోయాయి. 

By
en-us Political News

  
ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు కీలక సూచన చేశారు.
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు.
వెనిజులాపై దాడి నేపధ్యంలో యూఎస్ ప్రభుతం ఆ దేశానికి రష్యా జెండాతో వెళ్తున్న మ్యారినెరా నౌకతో పాటు మరో దాన్ని సీజ్ చేసింది.
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని దేవదేవుని పట్ల తనకున్న భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
ప్రజా భవన్‌లో బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు
సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ, పోలవరం, నల్లమల ప్రాజెక్టు విషయంలో కర్నాటక, మహారాష్ట్రలు కూడా ముడిపడి ఉన్నాయనీ, అందుకే ఈ వ్యవహారాన్ని మీడియేషన్ లేదా సివిల్ సూట్ ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది.
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
పతంగులు ఎగరేయడానికి ఎవరైనా చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే చైనా మాంజా విక్రయించేవారిపైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చైనా మాంజా వినియోగం, విక్రయాలను సమూలంగా నిలిపివేయాలన్న లక్ష్యంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
హర్యానా ఫరీదాబాద్‌లోని ఈ యూనివర్సిటీ భవనాలు అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతోనే నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ నిధులు మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా వచ్చినవని ఈడీ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు.
సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే విశిష్ట కాకడ హారతి కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికి, బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.