చిరంజీవి వరప్రసాద్ సినిమా చూస్తూ రిటైర్డ్ ఏఎస్ఐ మృతి

Publish Date:Jan 12, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ థియేటర్ లో సినిమా చూస్తూ ఓ వ్యక్తి  మృత్యు వాత పడడంతో ఆ థియేటర్లో విషాదఛాయలు అలుము కున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా హైదరాబాదు నగరంలో ఉన్న పలు సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన అభిమాన హిరో చిరంజీవి నటించిన సినిమా చూడడానికి వచ్చి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌లో  చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. 

లింగంపల్లికి చెందిన ఆనంద్ కుమార్  (63) ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి 12వ బెటాలియన్ నుంచి రిటైర్ అయ్యారు. చిరంజీవి అభిమానిగా ఉన్న ఆయన ఈరోజు సోమవారం ఉదయం 11:30 గంటల షోకు కూకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌కు వచ్చారు. సినిమా ఆసక్తిగా వీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. క్షణాల్లోనే థియేటర్‌లో కుప్పకూలి కింద పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. 

ప్రాథమికంగా హార్ట్‌స్ట్రోక్‌ కారణంగానే ఆనంద్ కుమార్ మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగి స్తున్నారు. సినిమా థియేటర్‌ లోనే ఈ విధమైన విషాద ఘటన జరగడం పట్ల ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమా ఆనందంగా చూడటానికి వచ్చిన ఓ అభిమాని ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటన  నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి.
మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓటింగ్‌ కొనసాగుతోంది.
కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో విషాదం నెలకొంది.
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.
నారావారిపల్లిలో గ్రామ దేవత నాగాలమ్మకు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవులకు మేత తినిపించి ప్రధాని మోదీ భక్తిని చాటుకున్నారు.
నారావారి పల్లెలో జ‌రిపే సంక్రాంతి వేడుక‌ల్లో నారా, నంద‌మూరి కుటుంబసభ్యులందరూ క‌ల‌సి పాల్గొంటారు. దీంతో ఈ ఊరు క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. ఊరు ఊరంతా జాత‌రలాంటి వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు త‌రాల‌ వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది.
ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు.
ప్రభుత్వం ఈ బకాయిలను సరిగ్గా భోగి పండుగ రోజున విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలలో సంక్రాంతి సంతోషం రెట్టింపైంది. దాదాపు ఆరేళ్ల తరువాత ఈ బకాయిలు విడుదలయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.