ఖండాంతరాలు దాటుతున్న కాలుష్యం

Publish Date:Jan 28, 2017

Advertisement


మీరు ఓ పచ్చని పల్లెటూర్లో ఉన్నారు. ఆ ఊరి చుట్టుపక్కల ఓ వంద కిలోమీటర్ల వరకూ ఎలాంటి పరిశ్రమలూ లేవు. కాలుష్యాన్ని కలిగించే మరే ఇతర లక్షణమూ కనిపించదు. అయినా మీ ఊపిరితిత్తులలోకి కాలుష్యం చేరిపోయే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

 

ఏరోసోల్‌

డియోడరెంట్ మీద ఉన్న మూతని నొక్కితే ఒక్కసారిగా అందులోని రసాయనం చిన్న చిన్న బిందువుల రూపంలోకి బయటకు వస్తుంది కదా! ఈ తరహా కణాలను ఏరోసోల్స్ అంటారు. రకరకాల చిన్న చిన్న కణాలు, వాయువుల సముదాయమే ఈ ఏరోసోల్‌. ఈ మధ్యకాలం వరకూ కూడా వీటి గురించి శాస్త్రవేత్తలు పెద్దగా అధ్యయనం చేయలేదు. కానీ వాటి నిర్మాణం, పనితీరు, పర్యావరణం మీద వాటి ప్రభావం గురించి మొదలైన అధ్యయనాలు ఇప్పుడు ఆందోళనను కలిగిస్తున్నాయి.

 

PAH

polycyclic aromatic hydrocarbons (PAH) అనేవి గాల్లో కాలుష్యాన్ని కలిగించే కణాలు. ఇంధనాన్ని మండించడం, అడవులు తగలబడటం వంటి కారణాల వల్ల ఇవి ఉత్పన్న అవుతాయి. నిన్న మొన్నటి వరకూ ఈ PAHలు కొంత దూరమే వ్యాపిస్తాయి అని నమ్మేవారు. కానీ ఇవి ఏరోసోల్ కణాల రూపంలో సుదూర తీరాలను చేరుకుంటున్నాయని ఇప్పుడే తేలింది.
ఈ విషయాన్ని నిరూపించేందుకు, పరిశోధకులు దాదాపు 300 ప్రదేశాలకు చెందిన గణాంకాలను సేకరించారు. అక్కడి వాయువులలో కాలుష్యకారకాలు ఏమేరకు ఉన్నాయో పరిశీలించారు. ఉదాహరణకు అమెరికాలోని ఒరేగెన్ రాష్ట్రంలో 9,000 అడుగులకి పైగా ఎత్తున ఉన్న ‘మౌంట్‌ బ్యాచ్‌లర్’ అనే పర్వతం మీద నాలుగురెట్లు ఎక్కువ PAH కణాలు ఉన్నట్లు బయటపడింది. పైగా పసిఫిక్ మహాసముద్రం ఆవల నుంచి ఈ PAHలు తేలి వస్తున్నట్లు గమనించారు.
బలపడుతున్నాయి

 

కాలుష్యాన్ని కలిగించే PAH కణాలు ఇతర వాయువులతో కలిసినప్పుడు బలపడుతున్నాయని అర్థమైంది. దాంతో అవి ఎంత దూరమైన వేగంగా, బలంగా ప్రయాణించగలుగుతున్నాయట. ఇలా బలపడిన కణాలు ఖండాలను, సముద్రాలను దాటుకునే వెళ్లిపోతున్నాయట. దీని వల్ల మున్ముందు ప్రపంచంలో ఊపిరితిత్తుల సమస్యలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి లక్షమందిలో ఇద్దరు ఈ PAHల వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందని ఊహిస్తున్నారు.
కాలుష్య కణాల ప్రమాదం గురించి తెలిసింది కాబట్టి, ఇహ ఇప్పుడు వాటని నివారించే ఉపాయాల గురించి కూడా పరిశోధించాల్సి ఉంది. సంపన్న దేశాలు మునుపటిలాగా మా కాలుష్యంతో మీకేంటి పని అని ఓట్రించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్య ప్రపంచంలో ప్రతి ఒక్కరిదీనూ!

 

- నిర్జర.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.