పొడిబారే కళ్లు – Dry Eyes Syndrome

Publish Date:Jan 30, 2017

Advertisement

పొడిబారే కళ్లు – Dry Eyes Syndrome

 


కంటి నీరు కేవలం మన బాధనో సంతోషాన్నో వ్యక్తం చేసేందుకే ఉపయోగపడదు. దాని వెనక బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. కంటికి కావల్సిన తేమని అందించడం, కంట్లో ఏర్పడే దుమ్మూధూళి కణాలను బయటకి పంపేయడం, కనుపాపని సూక్ష్మక్రిముల నుంచి కాపాడటం... ఇలా కళ్లు చెమ్మగిల్లుతూ ఉండటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ కొంతమందికి కంట్లో తేమే ఏర్పడదు. అదే DRY EYE SYNDROME.

 

ఇవీ లక్షణాలు
- కంట్లో ఏదో పడినట్లు గరగరలాడుతూ ఉండటం.
- తేమ లేకపోవడం వల్ల కళ్లు ఎర్రబారిపోవడం.
- చూపులో స్పష్టత లేకపోవడం, కాంతిని చూడలేకపోవడం.
- కళ్లు లాగుతున్నట్లుగా దురదగా అనిపించడం.
- అకస్మాత్తుగా కళ్లవెంబడి నీరు కారడం.

 

ఇవీ కారణాలు
- వయసు పైబడే కొద్దీ Dry Eyes సమస్య ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా మెనోపాజ్ దశని దాటిన స్త్రీలలో ఈ సమస్య   అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో శరీరంలోని హార్మోనుల పనితీరులో మార్పులు రావడం వల్ల ఇలా జరుగుతుంది.
- అలెర్జీల కోసం వాడే యాంటీహిస్టామిన్స్ వంటి మందుల వల్ల.
- కీళ్లజబ్బులు వంటి వ్యాధులు కూడా ఒకోసారి ఈ Dry Eyesను కలిగిస్తాయి.
- సుదీర్ఘకాలం కాంటాక్ట్‌ లెన్స్‌లను పెట్టుకోవడం.
- గంటల తరబడి కంప్యూటర్‌ స్క్రీన్‌ను చూస్తూ ఉండటం.
- కళ్లు ఆర్పే అలవాటు తక్కువగా ఉండటం.
- ధైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తగిన చికిత్స తీసుకోకపోవడం.
- విటమిన్‌ ఏ లోపం.
- తేమ తక్కువగా ఉన్న ప్రదేశాలలో నివాసం.
- చలికాలంలో నిరంతరం రూం హీటర్లు వేసుకుని ఉండటం.
 

 

చికిత్స
Dry Eyesకు శాశ్వతమైన నివారణ అంటూ ఏమీ లేదు. కాకపోతే తాత్కాలిక ఉపశమనం కోసం వైద్యులు ఐడ్రాప్స్‌ను వాడమని చెబుతారు. పాశ్చాత్య దేశాలలో అయితే Tear plugs, lipiflow వంటి చిన్నపాటి శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ మన దేశంలో ఇలాంటి చికిత్సలు తక్కువ. విటమిన్ ఏ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొంతకాలానికి ఉపశమనం కలగవచ్చు.

 


Dry Eyes సమస్య కంటిచూపుని దెబ్బతీసేంత ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ దీని వలన కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. కాబట్టి ఈ సమస్య రాకుండానే జాగ్రత్తపడాలి. కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక కళ్లని ఆర్పకుండా తదేకంగా గంటల తరబడి గడిపే అలవాటు మానుకోవాలి. దీంతో పాటుగా మంచి ఆహారం, తగినంత నీరు తీసుకుంటూ ఉంటే సమస్య అసలు మన దరికి చేరకపోవచ్చు.

 

- నిర్జర.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.