అధికార వైసీపీ నుంచి ఇటీవల సస్పెన్షన్ కు గురైన కొత్తపల్లి సుబ్బారాయుడితో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ.. నర్సాపురంలోని కొత్తపల్లి నివాసానికి చేరుకుని.. దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. అయితే వీరి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనే అంశాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు.
ఈ భేటీ అనంతరం ముద్రగడ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఇటీవల వరకు ముద్రగడ యమా సైలెన్స్ పాటిస్తూ వచ్చారు. ఇక జిల్లాల విభజనకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లాను విభజిస్తే... ఓ జిల్లాకు బి.ఆర్ అంబేద్కర్, మరో జిల్లాలకు బాలయోగి పేర్లు పెట్టాలంటూ సీఎం వైయస్ జగన్కు నేరుగా ఆయన బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే అమలాపురం కేంద్రంగా కొనసీమ జిల్లా ఏర్పాటు చేసిందీ జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు వరకు కొత్త పల్లి, ముద్రగడల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాల విభజన మొదలు.. బ్రిటిష్ కాలం నుంచి రెవిన్యూ డివిజన్ ఉన్న నరాసాపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం...అలాగే రెవిన్యూ డివిజనే లేని భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం.. జిల్లా విభజన క్రమంలో ఎవరినీ సంప్రదించక పోవడం.. అలాగే నరాసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుని.. ఎమ్మెల్యేగా ఎం ప్రసాదరాజును గెలిపించడం కోసం తాను, తన సోదరుడు కొత్తపల్లి జానకీరామ్ పడిన కష్టం.. అన్నీ పూసగుచ్చినట్లు కొత్తపల్లి ముద్రగడకు వివరించినట్లు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన జగన్ ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోవడమే కాకుండా.. అయిదుసార్లు ఎమ్మెల్యే, ఓ సారి ఎంపీగా, మంత్రిగా, కార్పొరేషన్ చైర్మన్గా వివిధ పదవులలో సేవలందించి రాణించిన తన లాంటి సీనియర్ను జగన్ పక్కన పెట్టడం పట్ల కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ రఘు రామకృష్ణంరాజు జగన్ నుఎన్ని తిట్లు తిట్టినా... ఆయనను వదిలేసి.. తనను సస్పెండ్ చేయడం ఏమిటో అర్థం కావడం లేదని ముద్రగడ ముందు కొత్త పల్లి సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా కాకుండా.. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం పట్ల నరసాపురం ప్రాంత ప్రజలు.. జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ముద్రగడకు కొత్తపల్లి వివరించినట్లు తెలుస్తోంది.
అదీకాక.. రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యంత కీలకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లితో భేటీ కావడం.. ఆ క్రమంలో సుదీర్ఘ మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా అందరిలో ఉత్కంఠ, ఆసక్తి రేకెత్తించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-importence-to-mudragada-25-137350.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.