రాహుల్ పర్యటనకు అడ్డంకులు.. ఓయూ కేంద్రంగా పొలిటికల్ హీట్

Publish Date:May 2, 2022

Advertisement

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను ఎలాగైనా విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు సమరోత్సాహం ప్రదర్శిస్తుంటే..ఎలాగైనా కట్టడి చేయాలని అధికార తెరాస నిర్బంధ వ్యూహాలను అమలు చేస్తున్నది. ఉస్మానియా విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి నిరాకరించడం, నిరసనలకు అవకాశం ఇవ్వకుండా విద్యార్థి నాయకులను ముందుస్తు అరెస్టులు చేయడం ద్వారా వర్సిటీ సెంటర్ గా రాజకీయ వేడి రగలడానికి కేసీఆర్ సర్కార్ కారణమైంది.దీంతో  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేసింది. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎలాగైనా సరే రాహుల్ ఉస్మానియాకు వస్తారంటూ కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్ యూ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.  ఎన్ఎస్ యూ రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలకు పిలుపు నివ్వడంతో రాష్ట్ర మంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఓయూ మొత్తాన్ని పోలీసులు దిగ్బంధించారు. రాహుల్ పర్యటనకు అనుమతి లేదనీ, వర్సిటీలో రాజకీయ కార్యకలాపాలను అనుమతించేది లేదని వీసీ విస్సష్టంగా తేల్చేశారు. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో గాందీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 
మొత్తంగా రాహుల్ పర్యటన ముందు రాష్ట్రం రగిలిపోతున్నది. రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఏ మాత్రం తగ్గడం లేదు. మహిళా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధంతో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు.  ఉద్యమాల పురిటి గడ్డ వంటి ఉస్మానియా వర్సిటీ కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయం రగులుతోంది.
 యూనివర్సిటీలోకి రాహుల్‌ గాంధీని తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ తెరాసల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉస్మానియాలో రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తుంటే, వర్సిటీలో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదన్నది వర్సిటీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం దానితో తెరాసకు ఏం సంబంధమని అధికార పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ కార్యక్రమానికి అనుమతి
ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన విశ్వవిద్యాలయం నుంచే తెరాసపై దండయాత్ర చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ నెల  6న వరంగల్‌ రైతు సంఘర్షణ సభకు రానున్న రాహుల్‌ గాంధీని 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆర్ట్స్‌ కళాశాల వద్ద విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందుకోసం ఓయూ వీసీని కలిసి అనుమతి కోరడం, ఆయన తిరస్కరించడం జరిగింది. వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో రాహుల్‌ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 7న విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు.  గతంలో  ఓయూలో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. . 2016 జూన్‌ 4వ తేదీన తెలంగాణ జనజాతర సమావేశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓయూ  విద్యా సంబంధ సమావేశాలకు తప్ప, రాజకీయ సంబంధిత సమావేశాలకు వేదిక కారాదని హైకోర్టు జూన్‌ 5వ తేదీన తీర్పు చెప్పింది. ఓయు కార్యనిర్వహక కౌన్సిల్‌ సైతం అక్కడ ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. మైకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని కూడా తీర్మానం చేసింది. 2020లో చేసిన తీర్మానాలను చూపి ఓయూ అధికారులు రాహుల్‌ సభకు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలిచింది. అయితే ఇప్పుడు అక్కడ అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది.   తెరాసకు వ్యతిరేకత ఉన్న చోట   కాంగ్రెస్‌ను అనుమతిస్తే   ఇబ్బందులు తప్పవని భావించిన కేసీఆర్‌.. అక్కడ రాహుల్‌ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు రాహుల్‌ పర్యటన గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఓయూ కేంద్రంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓయూలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. కేసీఆర్‌, కాంగ్రెస్‌ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమాలు పోటీలు పడి మరీ నిర్వహిస్తున్నారు.  పోటాపోటీగా ఆందోళనలతో యూనివర్సిటీని అట్టుడికిపోతోంది. ఒక మరోవైపు తెరాస, కాంగ్రెస్‌ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు శృతి మించుతున్నాయి. రాహుల్‌ గాంధీ ఓయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని తెరాస డిమాండ్‌ చేస్తుండగా.. తెలంగాణ ఇచ్చిన రాహుల్‌ గాంధీకి అనుమతి ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తోంది. అసలు రాహుల్‌ గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్‌ ఎందుకు భయపడి అడ్డుకుంటున్నారనీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ సహా 18 మంది అరెస్టు చేశారని.. ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఓయూ అధికారులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంతో   న్యాయస్థానం తీర్పు అనుకూలంగా రాకపోతే హైదరాబాద్‌ నగరంలో 7వ తేదీ రాహుల్‌ పర్యటనలో తగినట్లు కార్యక్రమాలను మార్పులు చేసి విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని మరో చోటైనా నిర్వహించేందుకు పీసీసీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకుంటోంది.  

By
en-us Political News

  
జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పిఠాపురంలో శుక్రవారం (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు, నిప్పు వంటి వారు. విమర్శల స్థాయిని వారిరువురూ దూషణల స్థాయికి దిగజార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతుంటారు.
బంగారం తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా? .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు.
పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు.
రాజ్ కసిరెడ్డి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు.
అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు.
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.