జగన్ 2.0 సూపర్‌యాప్‌ ఆవిష్కరణ..!

Publish Date:Jul 16, 2026

Advertisement

 

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత  జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సాంకేతికంగా మరింత చేరువయ్యే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్న కంటెంట్‌ను ఇష్టానుసారంగా తొలగించడం, కుట్రపూరితంగా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ ప్లాట్‌ఫామ్ అవసరమని భావించి ‘జగన్ 2.0 సూపర్‌యాప్‌’ను రూపొందించినట్లు చెప్పారు.

"ఈ యాప్‌లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఇది మన పార్టీకి చెందిన సొంత వేదిక కావడంతో బయటి వ్యక్తులు లేదా ఇతర సంస్థలు కంటెంట్‌ను తొలగించే అవకాశం ఉండదు. దీంతో కార్యకర్తల గొంతును అణిచివేసే కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు" అని జగన్ పేర్కొన్నారు.
పార్టీలోని గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు అందరూ ఈ యాప్ ద్వారా పరస్పరం అనుసంధానమై ఉంటారని తెలిపారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు.

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసు వేధింపులు, రాజకీయ పరమైన అంశాలు వంటి వాటిని నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరస్పరం టచ్‌లో ఉండేలా ఈ వేదిక పనిచేస్తుందని వెల్లడించారు.

పార్టీ నిర్వహించే సమావేశాలు, ప్రెస్‌మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్ ఫీడ్ రూపంలో అందుబాటులో ఉంటాయని జగన్ తెలిపారు. భవిష్యత్తులో కార్యకర్తల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఫీచర్లను జోడించి యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని యాప్‌లో నమోదు చేయవచ్చని, ఆ సమాచారంపై పార్టీ వెంటనే స్పందించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధితులకు అండగా నిలిచే అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు.

రాజకీయ వేధింపులు, పోలీసు వేధింపులకు గురవుతున్న పార్టీ కార్యకర్తల కోసం ఇప్పటికే నిర్వహిస్తున్న డిజిటల్ డైరీని కూడా ఈ సూపర్‌యాప్‌తో అనుసంధానం చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. దీంతో బాధితులు నేరుగా యాప్ ద్వారానే తమ ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

నమోదు చేసిన వివరాలు పార్టీ నాయకత్వానికి చేరి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీపై జరుగుతున్న అనుచిత ప్రచారం, విమర్శలు, వీడియోలు, పోస్టులపై ఫిర్యాదులు చేసి వాటిని తొలగించే చర్యలు కొనసాగుతూనే, మరోవైపు ఎవరూ అడ్డుకోలేని సొంత డిజిటల్ వేదికను రూపొందించుకున్నామని జగన్ పేర్కొన్నారు.

By
en-us Political News

  
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.