Publish Date:Apr 21, 2022
ఏపీ ప్రభుత్వం సిగ్గు పడాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన పనికి తలదించుకోవాలి. రాష్ట్రంలో అరాచక పాలనకు మరో నిదర్శనం ఇది. పాపం.. ఆ కుటుంబం.. అర్థరాత్రి నడిరోడ్డున పడాల్సి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఆ భక్తులు.. పోలీసుల ఝులంతో తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. సీఎం జగన్ కాన్వాయ్ కోసమంటూ.. ఖాకీలు చేసిన ఓవరాక్షన్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విషయం తెలిసి టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జరిగిన దారుణాన్ని ఎండగట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే...
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఐదుగురు సభ్యుల వేమల శ్రీనివాస్ కుటుంబం వెంకన్న దర్శనం కోసం ఇన్నోవా కారులో తిరుమల వెళ్తున్నారు. మార్గమధ్యలో భోజంన చేద్దామని.. బుధవారం రాత్రి 10 గంటల తర్వాత ఒంగోలులో ఆగారు. పాత మార్కెట్ సెంటర్లో వాహనం ఆపి.. టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న సీఎం జగన్ ఒంగోలు టూర్ ఉందని.. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం మీ వాహనంతో పాటు డ్రైవర్ కూడా కావాలని డిమాండ్ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్.. మీకు సారీ చెప్పడం మినహా తానేమీ చేయలేనంటూ.. తిరుమల వెళ్తున్న ఆ భక్తుల కారును, డ్రైవర్ను బలవంతంగా తీసుకెళ్లిపోయాడు ఆ కానిస్టేబుల్.
పాపం.. శ్రీనివాస్ ఫ్యామిలీ.. అర్థరాత్రి.. ఊరుగాని ఊరు.. నడిరోడ్డుపై ఉండిపోయింది. ఏం చేయాలో తెలీలేదు.. ఎవరిని అడగాలో.. తిరుమలకు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. పోనీ, తిరిగి ఇంటికెళ్దామన్నా ఆ నైట్ వాహనం ఎలా? ఆ రాత్రి ఎక్కడుండాలి? తెచ్చుకున్న వాహనాన్ని సీఎం కాన్వాయ్ కోసమంటూ పోలీసులు లాక్కెళ్లారు. మహిళలు, పిల్లలతో సహా.. రాత్రి పూట రోడ్డుపై నిలుచుండిపోయారు. ఇంతటి దారుణ పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. విషయం మీడియా దృష్టికి రాగా కలకలం చెలరేగింది. ఒంగోలు పోలీసులను ప్రశ్నిస్తే తమ దగ్గర సమాచారం లేదని చెప్పారు.
ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం స్పందించారు. సీఎం జగన్ కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెళ్లారని.. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. ‘‘భార్య, పిల్లలతో వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిది? కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడతారా? అధికారుల చర్యలతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు’’ అని నిలదీశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-over-action-in-ongole-39-134713.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.