Publish Date:Apr 21, 2022
జగన్ పాలనలో అవినీతి ఆనకొండలా మారి సర్వం స్వాహా చేసేస్తోంది. వైసీపీ ప్రజాప్రతినిథుల అవినీతి బాగోతం చివరికి ఆ పార్టీ నేతలే భరించ లేని స్థితికి చేరుకుంది. ఇంకా పార్టీతో అంటకాగితే తమ రాజకీయ భవిష్యత్ శూన్యం అవుతుందన్న భయం వైసీపీ నేతల్లో కనిపిస్తున్నది. అయినా ధైర్యం చేసి బయటపడలేని పరిస్థితిలో మింగ లేక కక్కలేక బాధపడుతున్నారు. అధినేత దర్శనమే గగనం... అంతర్గత సంభాషణల్లో పలువురు తమ మనసులోని ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
అయితే నూజివీడు ఎమ్మెల్యే అవినీతిపై వైసీపీ నాయకుడొకరు సాక్షాత్తూ విపక్ష నేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు బుధవారంనూజివీడు నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెంలో గ్రామ సభ నిర్వహించారు. విపక్ష నేత హోదాలో గ్రామస్తుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సభలోనే అనూహ్యంగా వీసీపీ నాయకుడు కాజా రాంబాబు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. మేకా ప్రతాప్, ఆయన తనయుడి అవినీతి బాగోతం గురించి, అవినీతి సొమ్ము గురించి గణాంకాలతో సహా తన వద్ద సాక్ష్యాలున్నాయనీ చెప్పరు. అక్కడితో ఆగకుండా వాటిని చంద్రబాబుకు సమర్పించారు.
వైకాపా నేతనే అయినా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకున్న కాజా రాంబాబు ఈ పోరాటంలో పార్టీలో తాను ఒంటరినైపోయానని వాపోయారు. అయినా పార్టీ వీడనని స్పష్టం చేశారు. మరి చంద్రబాబు సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు ఆంతర్యమేమిటి? ఈ ప్రశ్న వేయకుండానే ఆయన అదే సభలో కారణం చెప్పేశారు. అవినీతిపై పోరాటంలో తనకు పార్టీ మద్దతు లభించడం లేదనీ, అందుకే విపక్ష నేత మద్దతు కోసం వచ్చాననీ చెప్పుకున్నారు.
సాక్షాత్తూ చంద్రబాబుకే వైపాకా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై ఫిర్యాదు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. వైకాపాలో ప్రకంపనలు ఆరంభమయ్యాయి. విపక్ష నేతకు వైకాపా నాయకుడు సొత పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడాన్ని పార్టీ అధినేత సీరియస్ గా తీసుకున్నారు. నేడో రేపో రాంబాబుపై చర్యలు తప్పకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాంబాబుపై పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందన్నది పక్కన పెడతే వైకాపాలో విభేదాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నదానికి ఈ ఉదంతం అద్దంపడుతుంది. గతంలోలా ప్రతి విషయానికీ అధినేత కోసం చూసే పరిస్థితి ఇప్పుడు వైకాపాలో కనిపించడం లేదు. నెల్లూరు సంఘటనలు తీసుకున్నా, ప్రకాశం జిల్లాలో ఉవ్వెత్తున ఎగసి చల్లారిన అసమ్మతిని గమనించినా ఈ విషయం బోధపడుతుంది. ఇక నూజివీడు వైకాపా ఎమ్మెల్యే అవినీతిపై ఆ పార్టీకే చెందిన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు రానున్నరోజులలో మరెన్ని సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-leader-complaint-to-babu-on-ycp-mal-corruption-39-134719.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.