సమరానికి సిద్దమవుతున్న పోలీస్ శాఖ
Publish Date:Sep 26, 2012
Advertisement
రాష్ట్రంలో భద్రత నానాటికీ కొరవడుతోంది. అసలు ఈ పదం ఉచ్చరించటానికే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ముందుగా కేంద్ర సంస్థలను హెచ్చరించగల స్థాయికి ఇంకా పోలీసువిభాగం ఎదగలేదు. ఓ గోకుల్ఛాట్, ఓ ఛార్మినార్ వంటి అనుభవాలు నుంచి రాష్ట్ర పోలీసు శాఖ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. దీంతో కేంద్రశాఖలు ఎప్పటికప్పుడు స్పందించాల్సి వస్తోంది. పలానా కార్యక్రమాలకు ఎందుకు భద్రత లేదని ప్రశ్నించి హెచ్చరించాల్సిన స్థితి తప్పటం లేదు. ప్రత్యేకించి రాష్ట్రంలో నిర్వహించనున్న జీవవైవిధ్య సదస్సుకు విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. విదేశీయులు అడుగుపెట్టినప్పుడే ఉగ్రవాదులు పంజా విసరటానికి ప్రయత్నిస్తుంటారు. హింసకు పాల్పడే అవకాశమున్న ఈ సదస్సు గురించి ఇంటలిజెన్స్ బ్యూరో స్పందించింది. ఈ సదస్సుకు వచ్చే వీవీఐపీలకు హైసెక్యూరిటీ కల్పించాలని ఇంటలిజెన్స్ కోరింది. విదేశీప్రతినిధులకు ఒక్కొక్కరికీ బాడీగార్డులను నియమించాలని పోలీసుశాఖను కోరింది. దీంతో పాటు సదస్సు జరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని కూడా సూచించింది. ముందుగా అనుమానితుల జాబితా తయారీ చేసి పోలీసుశాఖ వారిని అదుపులోకి తీసుకుంటే కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చని కూడా ఇంటలిజెన్స్ సూచించింది. దీంతో పోలీసువిభాగం అప్రమత్తమైంది. ఒకవైపు తెలంగాణా మార్చ్, మరోవైపు జీవవైవిధ్యసదస్సు కూడా రాష్ట్రపోలీసు విభాగ పనితీరుకు పెద్దసవాళ్లుగా నిలుస్తున్నాయి. ఈసారైనా భద్రతలో భేష్ అనిపించుకోవాలని పోలీసువిభాగం కొంచెం సీరియస్ వర్కవుట్ చేసేందుకు సిద్ధపడుతోంది. అలా కనుక చేయకపోతే మాత్రం విమర్శలను ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా రాష్ట్రంలో భద్రతాసమస్య తీవ్రమవుతుంది కూడా.
http://www.teluguone.com/news/content/police-department-24-17704.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





