స్థానిక ఎన్నికల సస్పెన్స్‌ వీడేదెన్నడు?

Publish Date:Sep 26, 2012

Advertisement

 

 

 

స్థానికఎన్నికలు...ఈ మాట తరుచుగా కాంగ్రెస్‌ పెద్దల నోట మాత్రమే వినిపిస్తోంది...
ప్పుడైనా  కార్యకర్తలను ఊరడిరచటానికి...ఇంకొంచెం ద్వితీయస్థాయి నాయకులకు ఆశలు కల్పించటానికి....మరికొంచెం ముందుకు వెళితే ప్రతిపక్షాల నోరు నొక్కటానికి కాంగ్రెస్‌ ఈ పదాన్ని ఓ అస్త్రంలా ఉపయోగించుకుంటోంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పోకిరి సినిమాలో షిండే అన్నట్లు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా....అన్నట్లు బతికే ఓ రాష్ట్రపెద్ద రోజూ ఎవరికో ఒకరికి స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయ్‌ అని చెప్పేస్తుంటారు. చివరికి ఇదెంత పెద్ద జోక్‌గా మారిందంటే ఆ పార్టీలో ఎవరు కూడా ఆ పెద్ద అంటే నమ్మకం లేనంతస్థాయికి తీసుకువెళ్లింది. అఫ్‌కోర్స్‌! అందరికీ తెలిసిన ఆ పెద్ద సిఎం కుర్చీలో కూర్చుని తన పదవి కోసం ఈ మంత్రాన్ని పఠిస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మాట నిలుపుకోలేని సత్తా ఆయనకే చెల్లిందని కాంగ్రెస్‌ సీనియర్లు, పలుజిల్లాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నారు. నలుగురు ఏమంటే నాకేటీ సిగ్గు అన్నట్లు ఆయన మాత్రం ఎక్కడ ఏ సభ జరిగినా ఈ పదం వాడకుండా ముగించటం లేదు. తాజాగా ఏలూరు కాంగ్రెస్‌ సభలో కూడా ఒక నెలలో స్థానిక ఎన్నికలు అని హామీ ఇచ్చేశారు. నెలల తరబడి ఒక నెలలో ఎన్నికలు అని ఆయన చెప్పుకుంటూ పోవటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉప ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ స్థానిక ఎన్నికలు కనుక జరిపించకపోతే ఖచ్చితంగా కేంద్ర నిధులు గ్రామపంచాయతీలకు ఆపేస్తామని కూడా హెచ్చరించారు. ఆ గడువు కూడా పూర్తయినా ఇప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియటం లేదు. ఉప ఎన్నికల ప్రచారానికి తిరుపతి వచ్చి వెళుతూ ఎయిర్‌పోర్టులో తనను సాగనంపటానికి వచ్చిన కూతుహలమ్మ వంటి కాంగ్రెస్‌ నేతలకు కూడా సిఎం ఒకనెలలో స్థానిక ఎన్నికలు జరిపించేసి పార్టీని బలోపేతం చేసేద్దామని లేని ఉత్సాహాన్ని కల్పించారు. అంత తొందరగా సిఎం స్పందించారంటే ఇక ఎన్నికలే అనుకుని ద్వితీయశ్రేణి నాయకత్వానికి చిత్తూరు నేతలు ముందుగా వరాలు కురిపించారు. ఆ ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు తిరుపతిలో ఎదురుతిరుగుతున్నారు. ఇదేమి పార్టీ అని కూడా నిలదీస్తున్నారు. మీ కన్నా మాట నిలుపుకునే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బావుందని తిరుపతి కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ సమావేశాల్లో విరుచుకుపడుతున్నారు. ఇంతలా సిఎం ప్రకటనపై నిరసన వ్యక్తం అవుతున్నా ఆయన మాత్రం అస్సలు ఈ విషయం పట్టించుకోలేదు. అంతేకాకుండా కేంద్ర మంత్రి చంద్రదేవ్‌ చెప్పినట్లే స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రత్యేకించి 11వ ఆర్థిక సంఘం నిధులు అస్సలు రాష్ట్రంలోని పంచాయతీలకు విడుదలవుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రప్రభుత్వానికి ఏర్పడిరది. దీంతో తాజాగా సీనియర్‌ మంత్రి జానారెడ్డి స్పందించి సుప్రీంకోర్టులో ఎన్‌ఎల్‌పీ వేసైనా నిధులను తెప్పించుకోవాలని భావిస్తున్నారు. నిధులు ఆపవద్దని కేంద్రాన్ని కోరుతామంటున్నారు. ముఖ్యమంత్రితో కూడా ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. అయితే ఎన్నికలు నిర్వహించటం అనేది ఇప్పట్లో జరగదని మాత్రం మంత్రి ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే అధికారాలు కోల్పోయి ఖాళీగా తిరుగుతున్న ద్వితీయశ్రేణి నేతలు మాత్రం ఈ సస్పెన్స్‌కు తెరదించాలని డిమాండు చేస్తున్నారు. నేరుగా అధిష్టానం ఈ విషయంలో పూనుకోవాలని వారు కోరుకుంటున్నారు.

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.