పోలీసులు అనగానే కరకుగా ఉంటారన్నది అందరి మనసులో ఉన్న సహజ అభిప్రాయం. అది కొంత వరకే నిజం. పోలీసులకు మనసు ఉంటుంది. కఠినంగా ఉండడం అనేది పరిస్థితులను అనుసరించి ఉంటుంది. దొంగల్ని పట్టినపుడు, రోడ్డు మీద ఆకతాయిల్ని కొట్టేటపుడు, రోడ్డు సెన్స్లేకుండా వెళ్లే వాహ నాలను పట్టినపుడు ఆగ్రహించడం తిట్టడం, కొండకచో కొట్టడమూ చేస్తుంటారు. కానీ ఖాఖీల్లోనూ చక్కగా స్పందించే మనసు ఉంటుంది. చాలామంది ఇపుడు కొత్తగా సర్వీసుల్లో చేరేవారిలో మంచి విద్యాబుద్ధులు ఉన్నవారు, మంచి చేయడానికి దూకుడుగానూ వ్యవహరిస్తారన్నది ఉన్నమాట. ఇక్కడో పిల్ల పోలీసు కర్రకోసం మహిళా కానిస్టేబుల్ని అడుగుతుం డడం చూస్తున్నారు.
పిల్లలకు ప్రతీదీ ఆటవస్తువే. పోలీసు చేతిలో కర్ర అయినా సరే! నిత్యం డ్యూటీతో విసిగెత్తి ఉండేవారికి ఇలాంటి పిల్లల ఆటలు కాస్తంత ప్రశాంతతనిస్తాయి. అందుకే ఆ పోలీసామె ఆ పిల్లను కొంత ఆటపట్టిం చింది. కర్ర అడగ్గానే ఇవ్వడం లేదు.. దాన్ని దాచే ప్రయత్నం చేసింది. కానీ పిల్లలు చూపు మరల్చరు. వారి దృష్టి ఎప్పుడూ కావాల్సిన దానిపైనే ఉంటుంది. ఒక్కసారి ఇవ్వమని గోల చేసింది.
పిల్లల మొండితనంలోనూ అందం, ఆకర్షణా ఉంటాయి. దానికి ఎవరయినా ఫిదా కావాల్సిందే. ఈ పోలీ సామె కూడా! అందుకే ఆటసరదాలు ఆడినంతసేపూ ఆడి తర్వాత ఓ క్షణం పాటు చేతికి ఇచ్చే ఉంటుం ది. దాన్ని ఆ చిన్నారి తన కంటే పెద్దదిగా ఉందని పట్టుకోను ఇబ్బంది పడే ఉంటుంది. కర్ర ఎక్కడ తగిలి ఏడుస్తుందోనని పోలీసామె కూడా అంతే జాగ్రత్తగా మరో చివర్న పట్టుకునే ఉంటుంది. పిల్ల తల్లిదండ్రుల మాట అటుంచితే, ఓ సమయంలో వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఇలాంటి స్నేహమే పోలీసామె ఆశిం చింది. పోలీసులంతా ఆశించేది కూడా ఇదే. ప్రజల నుంచి కూడా ఎక్కడన్నా స్వచ్ఛ మైన స్నేహ భావాన్ని,
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/playful-mood-of-constable-25-143370.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.