బీహార్ ఎన్నికలు.. పీకే వ్యూహ వైఫ్యలాలు!

Publish Date:Oct 16, 2025

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పీకే జన సురాజ్ పార్టీ ప్రభావం నామమాత్రమేనా? కింగ్ మేకర్, ప్రభుత్వ ఏర్పాటులో కీ ఫ్యాక్టర్ అంటూ పీకేపైనా, ఆయన జన సురాజ్ పార్టీపైనా సర్వేలు చెప్పినదంతా ట్రాషేనా? విశ్లేషకులు పీకే గురించి, బీహార్ ఎన్నికలలో ఆయన పాత్ర గురించి చెప్పినవన్నీ అభూతకల్పనలేనా? అన్న ప్రశ్నలకు పీకే స్వయంగా ఔనని చెప్పినట్లైంది.. ఆయన తాను వ్యక్తిగతంగా పోటీలో నిలబడటం లేదని ప్రకటించడం ద్వారా. 

ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని విజయాలు అందుకున్న పీకే ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. పెరిటి వైద్యం పని చేయదు అన్నట్లు పీకీ వ్యూహాలు ఆయన సొంత పార్టీ జన సురాజ్ కు ఇసుమంతైనా పని చేయడం లేదని ఆయన పోటీ నుంచి వైదొలగడం ద్వారా తేటతెల్లమైందంటున్నారు పరిశీలకులు.  
ప్రశాంత్ కిశోర్ బీహార్ ఎన్నికలలో జనసూరజ్ పార్టీని గెలుపు గుర్రంగా మార్చేందుకు గత రెండేళ్లుగా నిర్విరామంగా శ్రమించారు. పాదయాత్ర చేశారు. అధికార, విపక్ష కూటములపై విమర్శలు గుప్పించారు. యువతను ఆకట్టుకుని బీహార్ నే ఏలేయడానికి నేల విడిచి సాము చేశారు. ఉద్యమాలు, ఆందోళనలూ సరేసరి. 

సరే ఇక ఇప్పుడు ఎన్నికల వేళ ఎన్డీయే కూటమి, మహాఘట్ బంధన్ (ఇండియా కూటమి) కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించి గెలుపు రేసులో ముందున్నానని చాటుకున్నారు. రెండు జాబితాలు ప్రకటించేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడికి ప్రత్యర్థిగా నిలబడతానని చెప్పుకుంటూ వచ్చిన ఆయన తీరా జాబితాల ప్రకటన వేళ రఘోపూర్ నియోజకవర్గంలో తాను కాదు మరో అభ్యర్థిని నిలబెట్టారు. అక్కడే ఆయన గెలుపు బాటలో లేరని తేటతెల్లమైందంటున్నారు. ఇక ఆ తరువాత ఒక జాతీయ స్థాయి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వ్యక్తిగతంగా పోటీకి దూరం అని ప్రకటించేసి.. పార్టీకి విజయావకాశాలు అంతంతమాత్రమేనని చెప్పకనే చెప్పేశారు.  తాను  పోటీ చేసి గెలవడం కంటే తన పార్టీని గెలిపించుకోవడం ముఖ్యమన్న ప్రశాంత్ కిశోర్.. ఒక రకంగా జనసూరాజ్ కార్యకర్తలలో జోష్ ను చంపేశారని చెప్పాలి. 
అయితే తాను పోటీ నుంచి తప్పుకున్నా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జన సురాజ్ పార్టీ విజయం ఖాయమంటూ వ్యక్తం చేసిన ధీమా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
నిజంగా పార్టీ విజయం కోసం ఫుల్ టైం కేటాయించడానికి తాను పోటీలో ఉండకూడదని ఆయన నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేరు.. కానీ ఇదే ప్రకటన ఆయన చివరి నిముషంలో కాకుండా ఇంకా చాలా ముందే ప్రకటించి ఉంటే.. బెటర్ గా ఉండేది. అలా చేసి ఉంటే.. ఇప్పుడు ఆయన ఓటమి భయంతో పోటీ నుంచి పలాయనం చిత్తగించారన్న విమర్శలకు తావు ఉండేది కాదు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ తాను పోటీకి దూరం అని ప్రకటించడంతో  ప్రత్యర్థులకు ఆయన అస్త్రసన్యాసం చేశారంటూ ఎద్దేవా చేయడానికి అవకాశం ఇచ్చినట్లైంది. సొంత పార్టీలో కూడా ఆఖరి నిముషంలో తమ అధినేత కాడె వదిలేశారన్న భావన వ్యక్తం అయ్యేందుకు ఆస్కారం ఇచ్చింది. ఇక ప్రజలు  కూడా గెలుపు సత్తా లేని పీకే పార్టీకి ఓటేసి ఏం లాభం అన్న భావనకు లోనయ్యే అవకాశాలున్నాయి. అంటే తాను పోటీ నుంచి విరమించుకోవడంపై ప్రశాంత్ కిశోర్ ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా.. దాని వల్ల వాటి వల్ల జనసురాజ్ పార్టీకి కలిగే ప్రయోజనం శూన్యమేనని అంటున్నారు. యుద్ధానికి ముందు అస్త్రసన్యాసం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు.
తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు.
2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న నిర్ణయాత్మక శక్తి తెలుగుదేశం క్యాడరే అని అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరించారు. ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ కు తెలుగుదేశం క్యాడర్ అండగా నిలవడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో సునాయాస విజయం సాధించారని అంటున్నారు.
అనిల్ చోఖ్రా ముంబై కేంద్రంగా బినామీల పేర్లతో నాలుగు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
బీహార్ లోని చిరాగ్ పాశ్వాన్ విజయం సైతం సైతం ప‌వ‌న్ హండ్రడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ తోనే పోలుస్తున్నారు.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది.
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్ లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది.
2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం.
ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది.
జూబ్లీలో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు, అక్రమ మార్గాలకు, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారనీ, ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనీ అన్నారు.
ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.