Publish Date:Apr 26, 2022
ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వరుస భేటీలతో ఇక తన చేరిక లాంఛనమే అన్న ఇంప్రషన్ కలిగించిన పీకే చివరకు కాంగ్రెస్ లో చేరకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జెవాల ధృవీకరించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పీకే సలహాదారుగా కొనసాగుతారని చెప్పారు. పీకే నిర్ణయాన్ని గౌవరిస్తామనీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ఆ పార్టీతో కలిసి పని చేయడానికి పీకే ముందుకు వచ్చిన సంగతి విదితమే.
అ క్రమంలోనే పీకే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలతో వరుస భేటీలు జరిపారు. చివరకు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని దాదాపుగా అంతా భావించారు. అయితే టీ. కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచీ పీకే కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలను ఖండిస్తూనే వచ్చింది.
ఆయన నీడ కూడా కాంగ్రెస్ మీద పడదని టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పత్రికాముఖంగానే తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున పని చేస్తూ కాంగ్రెస్ లో కొనసాగడానికి తమ పార్టీ నిబంధనలు అంగీకరించవనీ, అధినేత్రి అస్సలు ఒప్పుకోరనీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విధంగానే చివరికి పీకే కాంగ్రెస్ లో చేరడం లేదని తేలిపోయింది.
ఇలా ఉండగా పీకేతో చర్చల అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సాధికార కార్యాచరణ గ్రూప్ -2024 (ఈఏజీ)ను ఏర్పాటు చేశారనీ, ఆ గ్రూప్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా పీకేను ఆహ్వానిచారనీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జెవాల ట్విట్టర్ ద్వారా తెలిపారు. పీకే నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని పేర్కొన్నారు.
కాగా తాను కాంగ్రెస్ లో చేరబోవడం లేదని పీకే కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి తనను ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలంటూ ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న పీకే, అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు కావలసింది తాను కాదనీ, పార్టీ సంస్థాగత నిర్మాణ సమస్యలను పరిష్కరించగల సమర్ధ నాయకత్వమనీ పేర్కొన్నారు. అందుకే తాను సోనియా గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించాననీ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk--rejects-to-join-congress-25-135012.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.