Publish Date:Aug 26, 2022
మనిషికి మొదట పరిచయం అయిన జంతువు కుక్క అని అంటారు చరిత్రకారులు. కుక్కల పెంపకం పట్ల మోజు పెరుగుతూ వచ్చింది. బుజ్జి కుక్కపిల్లను పెంచుకోవడంలో అదో ఆనందం, సరదా. కేవలం కాపలాకే కాదు, అది చిన్నాచితకా ఇంటిపనుల్లో సాయం చేస్తూండడం గమనిస్తుంటాం. ఇటీవలి కాలం లో కుక్కల పెంపకం పెద్ద వ్యాపకంగానూ మారింది. పిల్లలతో ఆడటం, పెద్దవాళ్లకి వాకింగ్లో తోడుగా వెళ్ల డం, ఇంట్లో ఎవ్వరూ లేకపోతే గేటు దగ్గరే కాపలా కాయడం అన్నింటా వాటికి ప్రత్యేకించి శిక్షణ నిస్తు న్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యునిగానే కుక్కను ప్రేమగా చూసుకోవడం గమని స్తుంటాం.
ఇటీవల శివాంగ్ అనే నెటిజన్ ఒక వీడియో పెట్టాడు. పిజ్జా బాయ్కి ఎంతో సహకరిస్తోందన్నది దాని కాప్ఫ న్. ఇది ఎక్కడిది అనే ప్రశ్న వదిలేస్తే ఆ కుక్క అతనికి ఏపాటి సాయం చేస్తోందన్నది తెలుసు కోవాలి. ఎందుకంటే, వాటికి ఫలానా ఇంటికి లేదా ఫ్లాట్కి వెళ్లి ఇవ్వమనగానే సెక్యూరిటి వాడి దగ్గరికి వెళ్లి నిల బడుతుందిట. అతను దాన్ని తీసుకుని కుక్కతో పాటు ఆ ఫ్లాట్కి వెళ్లి సెక్యూరిటీవాడు ఇవ్వగానే పరు గున వచ్చి తన యజమానికి ఇచ్చేసిన సంగతి తోకతో కొట్టి మరీ చెబుతోంది!
ఇలాంటి సహాయం చేసే కుక్కల్ని పెంచుకుంటే పని భారం మరీ తగ్గుతుందని పిజ్జా అమ్మే కంపెనీలూ భావిస్తున్నాయి. నిజంగానే ఇది మంచి సూచన. ఆ కుక్క పిజ్జాబాయ్తో పాటు బండి మీద తిరుగుతుంది. ఎక్కడ ఆపితే అక్కడ దిగి ఆ అడ్రస్ ఉన్న ఇంటి దగ్గర ఎవరు ఉంటే వారిని తానే ముందుగా పిలుస్తోంది. ఆ తర్వాత పిజ్జా బాక్స్ తెమ్మని తోక ఊపుతుంది. ఇతగాడు పిజ్జా పట్టుకుని వెళతాడు. అదే అపార్ట్మెంట్లకి అయితే బండి అక్కడ గేటు దగ్గర ఆగగానే పరుగున ఫ్లాట్స్ కాపలావాడి దగ్గరికి వెళ్లి బయటికి రమ్మని గోల చేస్తుంది! రాగానే అతనికి దాని సంగతి తెలుస్తుంది. ఇది రోజూవారీ ఆ కుక్క కార్యక్రమం. పిజ్జా అమ్మే వాడికి, తీసుకునేవారికి అదో సరదాగానూ మారిందట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pizza-dog-25-142664.html
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.