మోహన్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయన శ్రీ విద్యానికేతన్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలతో పాటు వాటి ఉప ఆలయాలు వెరసీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మణ ఆధిపత్యం కానీ ఈ సామాజిక వర్గం పట్ల గౌరవాభిమానాలు గానీ ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఒకింత ఎక్కువగానే ఉంటాయ్. తిరుమలలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతమైందంటే అందుకు కారణం ఈ బ్రాహ్మణుల నిష్టాగరిష్టతలే కారణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ.. ఈ ప్రాంతంలో తాను పుట్టడం మాత్రమే కాకుండా, ఇక్కడే తన విద్యా వ్యవస్థను సైతం స్థాపించి, ఇంకా ఈ ప్రాంతంతో తన అనుబంధం పెంచుకుంటూ వస్తున్నారు మోహన్ బాబు. అంటే ఈ ప్రాంత నమ్మకాలపై ఆయనకుగానీ ఆయన కుటుంబానికి గానీ ఈ సామాజిక వర్గంపై ఒక మర్యాద ఉండే ఉంటుంది. కానీ ఇందుకు రివర్స్ లో వెళ్తోంది మోహన్ బాబు ఫ్యామిలీ. దేనికైనా రెడీ విషయంలోనూ సరిగ్గా ఇలాంటి వ్యవహారమే నడిచింది. అప్పట్లో అదో పెద్ద గొడవ. ఫిలింనగర్ లో ఆయన నివాసం ముందు ఆందోళనలూ నడిచాయి.
తాజాగా కన్నప్ప లో పిలక- గిలక వ్యవహారం మరో సారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో పిలక- గిలక అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్ కన్నప్ప. మొన్నటికి మొన్న శివరాత్రి సమయంలో సాక్షాత్ ఆ శ్రీకాళహస్తీశ్వరుడి ముందు నిబంధనలకు విరుద్ధంగా టీజర్ రిలీజ్ చేశారన్నది ఒక వివాదం కాగా.. హార్డ్ డిస్కులు పోయాన్నది మరో వివాదం. తాజాగా ఈ పిలక- గిలక పోస్టర్ కలకలం. ఈ పిలక- గిలక పాత్రల ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవహేళన చేశారంటూ ఆ సమాజికవర్గాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కన్నప్ప సినిమాలో ఉద్దేశ పూర్వకంగానే ఈ పాత్రలను పెట్టారని బ్రాహ్మణ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇది బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీయడంతో సమానమన్నది అంటున్నాయి. దీంతో కన్నప్ప ప్రీ- రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.
నిజానికి కన్నప్ప అనే పాత సినిమాని బట్టి చూస్తే కాళహస్తీశ్వర ఆలయ పూజారి (రావుగోపాలరావు పోషించిన పాత్ర) కన్నప్పను నిజంగానే ఇబ్బందుల పాలు చేసినట్టు కనిపిస్తుంది. మరి అప్పుడిదే బ్రాహ్మణ సంఘాలు ఎందుకింతగా వ్యతిరేకించలేదన్నది ఒక వాదన కాగా.. రెండోది ఏంటంటే మోహన్ బాబు కుటుంబానికి బ్రాహ్మణులతో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందన్నది మరో కామెంట్ గా తెలుస్తోంది.
ఇప్పటికే కన్నప్ప బడ్జెట్ 100 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్ స్టార్స్ ఇందులో ఉన్నా.. అంతా టాక్ ని బట్టే రికవరీ అవుతుంది. అందుకంటూ ఒక బూస్టింగ్ అవసరం. అలా జరగాలంటే సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలి. ఇప్పటికే చాలా చాలా ట్రై చేసిన మంచు వారి బృందం.. తాజాగా బ్రాహ్మణులకు సంబంధించిన వివాదాల తుట్టె కూడా కదిపినట్లు కనిపిస్తోంది. దీంతో తమ సినిమా డెఫినెట్ గా వార్తల్లో ఉండటమే కాక.. ప్రేక్షక జనం దృష్టిని సైతం ఆకర్షించడం ఖాయ మన్నట్టుగా.. భావిస్తున్నారు. మరి చూడాలి ఏమౌతుందో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pilaka-gilaka-dispute-in-kannappa-moovie-39-199595.html
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ఇది కేవలం ఒక శాఖపై ఉన్న ఆసక్తి మాత్రమే కాదు.. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు గారి అద్భుత వారసత్వం. నౌపాడ - గుణుపూర్ నారోగేజ్ లైన్ను బ్రాడ్గేజ్గా మార్చడం, విశాఖపట్నం నుంచి పలాస, భువనేశ్వర్ వరకు కొత్త మెమో రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికులకు అనుసంధానతను పెంచడంలో ఎర్రన్నాయుడు గారు చేసిన కృషిని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.