ఇప్పుడు డీలర్ల వంతన్నమాట!
Publish Date:Sep 27, 2012
Advertisement
నిన్నటి వరకూ ధరల వడ్డింపుతో సతమతమైన సగటుమనిషి బాధలు ఇప్పుడప్పుడే తీరేటట్లు లోవు. ఇప్పుడు పెట్రోలు డీలర్ల వంతొచ్చింది! అదెలాగంటో` నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డామనీ, ఈ ఇబ్బందులు తగ్గించుకోవడంలో భాగంగా అక్టోబర్ 15నుండి బంక్లను అన్ని వేళలా (24 గంటలు) తెరచివుంచలేమనీ పెట్రోల్ బంక్ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఎక్కువ కమీషన్ కావాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక నుండి 24 గంటలు నడుస్తున్న పెట్రోలు బంక్లు కొన్ని గంటలకే పరిమితం కానున్నాయన్నమాట! అయితే ఇది మరో 15 రోజుల్లో ఆయిల్ సంస్థలు తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. ప్రభుత్వాలు ధరలు పెంచిన ప్రతిసారీ వ్యాపారవర్గృాలు రేట్లుపెంచడంతోబాటు మరిన్ని వెసలుబాట్లు కావాలంటూ డిమాండ్ చేయడం, సమ్మెలు చేయడం నిరంతరంగా జరిగిపోతోంది. అయితే` వీటన్నింటి మూలాన ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయేది మాత్రం ప్రజలే! ఈ ధరల పెంపుదలవల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు దినదినగండంగా రోజుగడపవలసిరావడం శోచనీయం! ప్రభుత్వానికైనా... కంపెనీలకైనా... ఇలా ఎవరికి కోపం వచ్చినా... నష్టపోయేది సామాన్యులే అన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా ధరలపెంపు విషయంలో సామాన్యుని స్థితిగతులను దృష్టిలో పెట్టుకోకుంటే ప్రజాందోళన ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/petrol-dealers-24-17729.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





