Publish Date:Feb 13, 2025
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కుళ్లు రాజకీయాలు అంతం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పొడగిట్టదన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలే లేకుండా చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అడుగడుగునా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోంది.
అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల నాటకానికి తెరలేపిన వైసీపీ కర్నూలును న్యాయరాజధాని చేస్తామంటూ హడావుడి చేసింది. కానీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదు. అమరావతి నిర్మాణం పూర్తయితే తెలుగుదేశంకు ఆ క్రెడిట్ దక్కేస్తుందన్న దుగ్ధతోనే అలా వ్యవహరించిందనడంలో సందేహం లేదు.
సరే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ జగన్ హయాంలో జరిగిన విధ్వంసాలను ఒక్కటొక్కటిగా సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతోంది. రాయలసీమ వాసుల చిరకాల వాంఛ అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా చకచకా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి అందుబాటులో ఉన్న భవనాల వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే అందజేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ మరో నాలుగైదు నెలలలో సాకారం అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలకు వైసీపీ తెరతీసింది. అమరాతి ఏపీ ఏకైక రాజధాని అని హైకోర్టు ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అధికారం లేదంటూ ఇద్దరు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కర్నాలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరారు. తాండవ యోగేష్, తురాగా సాయిసూర్య అనే ఇద్లరు న్యాయవాదులు వేసిన ఆ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీయే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రం మొత్తం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును స్వాగతిస్తున్నది. రాయలసీమ వాసులు తమ చిరకాల ఆకాంక్ష సాకారమౌతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఆ ప్రక్రియను నిలిపివేయాలంటూ పిటిసన్ దాఖలు కావడంతో సర్వత్రా వైసీపీ కుళ్లు రాజకీయాల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తమ హయాంలో న్యాయరాజధానిగా కర్నూలు అంటూ ఊదరగొట్టి ఆ దిశగా ఒక్క అడుగుకూడా వేయని వైసీపీ, ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే తెలుగుదేశం సర్కార్ కు క్రెడిట్ దక్కుతుందనీ, రాయల సీమలో తమ ప్రతిష్ట దిగజారిపోతుందన్న భయంతోనే ఆ ప్రక్రయిను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. తమకు దక్కని క్రెడిట్ తెలుగుదేశంకు దక్కడానికి వీల్లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ద్వారా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేగంగా వేస్తున్న అడుగులకు బ్రేక్ వేయాలన్నదే వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/petition-in-highcourt-against-high-court-bench-in-kurnool-39-192854.html
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.