వార్ ఆవిర్భావ వారోత్సవాలతో వణుకుతున్న తెలంగాణా ?
Publish Date:Sep 24, 2012
Advertisement
ఇప్పటిదాకా బలహీనపడిరదని పోలీసుశాఖ చెప్పుకొస్తున్న పీపుల్స్వార్(నక్సల్స్) పార్టీ ఆవిర్భావ వారోత్సవాలతో తెలంగాణాజిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ వారోత్సవాలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని వార్ కసరత్తులు చేస్తోంది. అందుకని ప్రత్యేకంగా కేడర్ ఎంపికకు ఆహ్వానాన్ని కూడా గ్రామీణులకు, గిరిజనులకు తెలియజేసింది. పార్టీ కేంద్రకమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లా నేతలు ఈ ఎంపిక పకడ్బందీగా చేయాలని భావిస్తున్నారు. అందుకే దీన్ని అడ్డుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే సీరియస్గా యుద్ధవాతావరణం సృష్టించటానికి కూడా వెనుకాడటం లేదు. పూర్తిస్థాయి తెగింపుతో చావో, రేవో అన్నట్లు వార్ కేడర్ రిక్రూట్మెంట్ చేస్తోందన్న సమాచారం పోలీసులు ముందస్తుగానే తెలుసుకున్నారు. ఆవిర్భావ వారోత్సవాల్లో వార్ మునిగి ఉండగానే దెబ్బతీయాలని పోలీసులూ వ్యూహాలు పన్నుతున్నారు. అప్పుడైతే సానుభూతిపరులు కూడా వణుకుతారని పోలీసుఅధికారులు భావిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో వార్ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతీయవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇలా రెండు పక్షాలు సీరియస్గా ఈ వారోత్సవాలపై దృష్టి పెట్టడంతో ఈ మూడు జిల్లాల్లోని వార్ప్రభావిత ప్రాంతవాసులు వణుకుతున్నారు. వార్ కమిటీబాధ్యులు హరిభూషణ్, బడేదామోదర్ అయితే ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రత్యేకించి సాంస్కృతిక కార్యక్రమాలు కళాబృందాలతో నిర్వహిస్తూనే కేడర్ను ఎంపిక చేయాలని వార్ నిశ్చయించుకుంది. ఈ ఏడాది మే 9న మహదేవపూర్ మండలం ముకునూరు గ్రామంలో మావోయిస్టు నక్సల్స్ ప్రజాకోర్టు పెట్టి దమ్మూరు మాజీ సర్పంచ్ భర్త వెంకటస్వామిపై కాల్పులు జరపటం, అతని తమ్ముడు మాజీ ఎంపిపి చిన్నన్నను చితకబాదటం వల్ల వార్ ఓ రకంగా గ్రామీణప్రాంతాల్లో భయాన్ని కలిగించిందని భావిస్తున్నారు. ఇదే సంఘటనపై వార్ కూడా నివేదికలు తెప్పించుకుందని తెలుస్తోంది. గోదావరి ఖని డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మహదేవ్పూర్ చేరుకుని పోలీసులు తీసుకోవాల్సిన భద్రతాచర్యలు సమీక్షించారు. అంతేకాకుండా నక్సల్స్ కార్యక్రమాలను అణిచివేసేందుకు ముందుగానే బలగాలను కూడా రప్పించారు. దీంతో ఇరుపక్షాలు పట్టుదలగా తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని గ్రామీణులు భయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/peoples-war-party-24-17615.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





