‘బాబు’ పర్యటనకు ముందుగానే సమస్యల ఎంపికలో రాటుదేలుతున్న తమ్ముళ్లు
Publish Date:Sep 24, 2012
Advertisement
అనంతపురం జిల్లా హిందుపురం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తపర్యటనలు ప్రారంభించక ముందే తెలుగుతమ్ముళ్లు స్థానిక సమస్యలను వెదుకుతున్నారు. ఈ సమస్యలపై ముందస్తుగా యుద్ధం ప్రకటించి ఆనక చంద్రబాబు చేత లాంఛనప్రాయంగా రాష్ట్రప్రభుత్వవైఖరిని ఎండగట్టాలని వారు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీలో జిల్లా కేడర్ ఉన్న నాయకులందరూ తమ ప్రాంతంలో కీలకమైన సమస్యలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రనేతలైతే అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యలనూ అథ్యయనం చేస్తున్నారు. ఈ పర్యటనలో ప్రస్తావించే సమస్యలు స్థానికులను ఆకట్టుకోవాలనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ పార్టీ నేతలు సమస్యలున్న ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి సమస్య లోతులను కూడా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. బాధితులు చెప్పిన వివరాలు, గణాంకాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ లోక్సభ నేత, ఎంపి కింజరపు ఎర్రంనాయుడు తమ (శ్రీకాకుళం) జిల్లాలోని సారవకోట వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రతీగ్రామంలోనూ పారిశుథ్యం క్షీణించటాన్ని ఆయన గమనించారు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో బాధపడుతున్న వారిని పలకరించి మరణాల గురించి వాకబు చేశారు. వైద్యాధికారులు గ్రామాల్లో అందుబాటులో లేరని తెలుసుకున్నారు. మొత్తం పరిస్థితి అర్థం చేసుకున్నాక మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండు చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య అవసరాలను గుర్తించటం లేదని ధ్వజమెత్తారు. ఇక ఇదే పార్టీకి చెందిన నేత కోడెల శివప్రసాద్ ఇటీవల నీటి విడుదల తీరుతెన్నులను పరిశీలించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ల్లో నీరు నిండుగా ఉందన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు. డెల్టా రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తాజాగా ఆయన చేసిన ప్రకటన చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ల్లో నీరున్నా ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే తిప్పికొట్టాలని కోడెల రైతులకు పిలుపు ఇచ్చారు. ఈ రెండు అంశాలూ కూడా తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వచ్చేలా ఇద్దరు నేతలూ కృషి చేశారు. బాధితులను కూడా బాబు పర్యటనకు వచ్చినప్పుడు కలవాలని కోరారు. ఈ రెండు అంశాలపై బాబు తీవ్రంగా స్పందిస్తే ఆందోళన చేయటానికి కూడా ఈ నేతలు సిద్ధంగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/chandrababu-yatra-24-17614.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





